నిన్న ‘సుప్రీమ్’ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చిన నేపధ్యంలో మంచి జోష్ పై ఉన్న సాయి ధరమ్ తేజ్ కు మరొక స్వీట్ టాక్ తగిలింది. ఈ మెగా యంగ్ హీరో సమంతతో ఒక్క సినిమా కూడ చేయలేదు. అదే విధంగా సమంత పక్కన హీరోగా నటించే స్థాయికి సాయిధరమ్ ఇంకా ఎదగలేదు. ఈ విషయాలు ఏమి పట్టించుకోకుండా మెగా మేనల్లుడిని ఉద్దేశించి సమంత చేసిన ట్వీట్ టాపిక్ అఫ్ ది టాలీవుడ్ గా మారింది.  

‘సాయిధరమ్ తేజ్ నీ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ మై స్టార్’ అంటూ లవ్ సింబల్ కూడ యాడ్ చేసి ట్వీట్ పెట్టింది సమంత. దీనితో సమంత ట్వీట్ చూసి ఉప్పొంగిపోయిన సాయి ధరమ్ తేజ్ ‘‘థ్యాంక్ యు సో మచ్. ఇది నాకు చాలా చాలా స్పెషల్ ట్విట్’’ అని రిప్లై ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తూ ఉంటే భవిష్యత్తులో వీళ్లిద్దరూ కలిసి సినిమా ఏమైనా  చేస్తారా అనే సందేహాలు కలుగు తున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఈవార్తలు ఇలా ఉండగా నిన్న రిలీజైన ‘సుప్రీమ్’ కు మంచి టాక్ వచ్చింది. అనిల్ రావిపూడి ‘పటాస్’ స్థాయిలో కాకపోయినా ఓ మోస్తరుగా అనిపించే పైసా వసూల్ మాస్ ఎంటర్ టైనర్   అంటూ ఈసినిమా పై టాలీవుడ్ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడ సాయి ధరమ్ తేజ్  తన రొటీన్ ప్రకారం తన మెగా మావయ్యలిద్దరినీ తెగ వాడుకున్నాడు చిరంజీవి పాట ‘అందం హిందోళం’ రీమిక్స్ పాటలో చిరు, పవన్, సాయిధరమ్.. ముగ్గురూ కలిసి కనిపించడం విశేషం. 

డ్యాన్సులు, ఫైట్లు, మేనరిజమ్స్ అన్నింట్లోనూ చిరంజీవిని - పవన్ కళ్యాణ్ ను చాలాసార్లు గుర్తుకు తెచ్చాడు ఈ మెగా మేనల్లుడు. అయితే ఈ మావయ్యల అనుకరణకు త్వరలో సాయి ధరమ్  తేజ్ తెరదించక పోతే అతడి కెరియర్ కు అసలుకు మోసం వస్తుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: