వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారిన శ్రుతిహాసన్ పెళ్ళి వార్తలు ఆమె తండ్రి కమలహాసన్ దృష్టి వరకు వెళ్ళి కమల్ కు కూడ షాక్ ఇచ్చినట్లు టాక్. శ్రుతి నిరంజన్ అయ్యంగార్ అనే వ్యక్తిని తాను పెళ్ళి చేసుకున్నాను అని అర్ధం వచ్చేలా ఒక ఫోటోను తన ‘ఇన్‌స్టా‌గ్రా‌మ్’ లో పోస్ట్ చేసి నిన్న చాలామందికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ న్యూస్ వెబ్ మీడియాకే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మీడియాలలో వైరల్ గా మారిపోయి అందరి మైండ్ ను బ్లాక్ చేసింది. 

అసలు ఈ నిరంజన్ అయ్యంగారు ఎవ్వరూ అతడు వ్యాపార వేత్తా ? హీరోనా ? లేదంటే అతడు విదేశాలలో స్థిర పడిన శ్రుతి స్నేహితుడా ? అంటూ రకరకాల కోణాలలో అన్వేషణలు చేస్తూ ఈ షాకింగ్ న్యూస్ వెనుక కారణాలు వెతకడంలో శ్రుతి అభిమానులు మరియు మీడియా బిజీగా మారిపోయింది. గేమ్ ఆఫ్ త్రోన్స్ లంచ్ విత్ మై డియరెస్ట్ హజ్బెండ్ అంటూ ట్వీట్  చేసిన శ్రుతి ఎందుకిలా చేసిందో ఎవరికీ అర్ధంకాని ప్రశ్నగా మారిపోయింది. 

అయితే సినిమా రంగంలో ఎందరో సెలెబ్రెటీలు ఉండగా శ్రుతి ఈ నిరంజన్ అనే వ్యక్తినే ఎందుకు ఎంచుకుంది అన్న ప్రశ్నకు చాలామందికి సమాధానం దొరకలేదు. ఈ హడావిడి ఇలా జరుగుతూ ఉంటే శ్రుతిహాసన్ ఈ విషయాలు ఏమి పట్టించుకోకుండా తన సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్ళి పోయింది. అయితే కొన్ని గంటల తరువాత ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. 

ఆ నిరంజన్ ఎవరోకాదు బాలీవుడ్ గీత రచయిత మరియు  రైటర్ కూడ, ఈ హడావిడి జరిగిన చాల సేపటికి శృతి మళ్ళీ రంగంలోకి వచ్చి ఇది జోక్ అంటూ కామెంట్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో జోక్స్ వద్దు అంటూ నీతులు చెపుతూ ఆమె కామెంట్ చేయడం ఆమె తండ్రి కమలహాసన్ దృష్టి వరకు వెళ్ళడంతో కమల్ కూడ షాక్ అయినట్లు టాక్. ఇంతకీ ఈ నిరంజన్ తో శ్రుతి ప్రేమలో పడిందా అన్నదే ప్రశ్నార్ధకం..  


మరింత సమాచారం తెలుసుకోండి: