టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పక్కన నటించడానికి అవకాశం వస్తే చాలు అని బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కూడ ఆసక్తికనపరుస్తున్న ప్రస్తుత పరిస్తులలో మహేష్ బాబుకు ‘బ్రహ్మోత్సవం’ విషయంలో ఎదురైన హీరోయిన్స్ సమస్య గురించి స్వయంగా మహేష్ ఒక మీడియా ఇంటర్యూలో చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ‘బ్రహ్మోత్సవం’ సినిమా కథ రీత్యా ముగ్గురు హీరోయిన్స్ ఉండటంతో ఈసినిమాకు ముందుగా సమంతను అదేవిధంగా ప్రణీతను ఎంపిక చేసిన తరువాత రెండవ హీరోయిన్ ఎంపిక కోసం చాల కష్టపడవలసి వచ్చింది అని మహేష్ చెప్పాడు. 

సమంత ప్రణీతలు ఎంపిక అయిన తరువాత మరో హీరోయిన్ కి ప్రాధాన్యత ఎక్కడ ఉంటుంది అని చాలామంది హీరోయిన్స్ ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కథ చెపుతాను అంటే వినడానికి కూడ  అంగీకరించని విషయాన్ని మహేష్ లీక్ చేసాడు. దీనితో షాక్ అయిన మహేష్ స్వయంగా కాజల్ కు ఫోన్ చేయడంతో ఆమె కథ కూడ వినకుండా ‘బ్రహ్మోత్సవం’ లో నటించడానికి ఒప్పుకుంది అంటూ ఆమె పై ప్రశంసలు కురిపించాడు మహేష్.

దీనిని బట్టి చూస్తూ ఉంటే సీనియర్ హీరోలకే కాదు ఒకొక్కసారి టాప్ యంగ్ హీరోలకు కూడ హీరోయిన్స్ సమస్య ఏర్పడుతోంది అనుకోవాలి. ఈవార్తలు ఇలా ఉంటే  ‘బ్రహ్మోత్సవం’ 85 కోట్ల బిజినెస్ ను క్రాస్ చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. ‘శ్రీమంతుడు’ సినిమా 79 కోట్ల బిజినెస్ ను చేస్తే అ మార్క్ ను దాటి 85 కోట్ల బిజీస్ ‘బ్రహ్మోత్సవం’ చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

అయితే ఈ స్థాయిలో బిజినెస్ జరిగిన సినిమాకు ఒక్క బ్లాబస్తర్ హిట్ టాక్ తప్ప మరే టాక్ ఈ సినిమాకు వచ్చినా బయ్యర్లు ఘోరంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థుతులలో ‘బ్రహ్మోత్సవం’ ‘శ్రీమంతుడు’ రేంజ్ ని మించిన భారీ కలక్షన్స్ ను తెచ్చుకుంటే కానీ అటు బయ్యర్లకు కాని ఇటు మహేష్ ఇమేజ్ కు కాని ఏమాత్రం మంచిది కాదు అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో రేపు ఈసినిమాకు ఎటువంటి తీర్పును ప్రేక్షకులు ఇస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగి పోతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: