మొన్న సాయంత్రం జరిగిన ‘ఒక మనసు’ ఆడియో ఫంక్షన్ లో అల్లుఅర్జున్ వ్యూహాత్మక స్పీచ్ తో పాటు ఆ స్పీచ్ జరుగుతున్నప్పుడు మెగా యంగ్ హీరోలు సీరియస్ లుక్ లో ఎదో జరుగుతోంది అని అర్ధం వచ్చేలా గంభీరంగా కూర్చోవడం లాంటి విషయాలను చూసిన విశ్లేషకులు ఇది పక్కాగా రచించిన స్క్రీన్ ప్లే లా కనిపించింది అని కామెంట్ చేస్తున్నారు. అల్లుఅర్జున్ స్పీచ్ తో తన పై వస్తున్న వివాదాలకు ముగింపు పలకాలని చాల ప్ర్రయత్నాలు చేసినా బన్నీ పై కామెంట్స్ ఆగడం లేదు.

ఇలాంటి పరిస్థుతులలో లేటెస్ట్ గా ఫిలింనగర్ లో వినపడుతున్న గాసిప్పుల ప్రకారం రామ్ చరణ్ ‘ఒక మనసు’ ఆడియో ఫంక్షన్ లో కొందరు ‘జై బన్నీ జైజై బన్నీ’ అంటూ చేసిన స్లోగన్స్ పై తీవ్ర అసహనంగా ఉన్నట్లు టాక్. ముఖ్యంగా నిహారిక తన స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇలాంటి స్లొగన్స్ మరింత ఎక్కువగా వినిపించడంతో ఆ స్లోగన్స్ ఇస్తున్న వారి వంక చరణ్ చాల నిశితంగా చూడటం చాలామంది దృష్టిని ఆకర్షించింది.

పవన్ కళ్యాణ్ వీరాభిమానులకు అల్లుఅర్జున్ ద్వారా క్లాసు పీకించాలని తయారు చేసుకున్న స్కెచ్ లో మధ్యలో ఈ ‘జై బన్నీ జైజై బన్నీ’ స్లొగన్స్ ఎందుకు వచ్చాయి అన్న విషయమై చరణ్ చాల లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరొక ఆశ్చర్యకరమైన ట్విస్ట్ ఏమిటంటే రామ్ చరణ్ అల్లుఅర్జున్ స్పీచ్ అయ్యే వరకు ఆడియో ఫంక్షన్ కు రాకపోడంతో  పాటు బన్నీ తన స్పీచ్ లో పవన్ అభిమానుల పై రెచ్చి పోతూ ఉంటే సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ లు చాల సీరియస్ లుక్ లో కనిపించడం బట్టి పవన్ కళ్యాణ్ వీరాభిమానులతో తమ సినిమాలకు కూడ సమస్యలు వస్తాయా అన్న ఆలోచనలలో ఉన్నట్లుగా వారి ముఖ కవళికలు బట్టి కనిపించింది.

ఒకవైపు పవన్ వీరభిమానులను టార్గెట్ చేస్తూ మరొక వైపు అదే ఫంక్షన్ లో మెగా యంగ్ హీరోల సాక్షిగా బన్నీ వీరాభిమానులు ‘జై బన్నీ జైజై బన్నీ’ స్లొగన్స్ ఇవ్వడంతో పాటు అల్లుఅర్జున్ వీరభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో ఘర్షణ పడటం లాంటి సంఘటనలకు వేదిదికగా ‘ఒక మనసు’  ఆడియో ఫంక్షన్ జరగడం రామ్ చరణ్ కు ఏ మాత్రం సంతృప్తి కరంగా లేదు అన్న గాసిప్పులు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: