జూనియర్ ఎన్టీఆర్ ప్రిన్స్ మహేష్ బాబులు చాల మంచి స్నేహితులు అన్న విషయం చాలమందికి తెలిసిన విషయమే. వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉండటమే కాకుండా వీరు నటిస్తున్న సినిమాల గురించి ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారని చాలామంది అంటూ ఉంటారు. ఇదిలాఉంటే, అంత క్లోజ్ కావడం వల్లే ఎన్టీఆర్ బర్త్ డేరోజైన మే 20న  తన సినిమా 'బ్రహ్మోత్సవం’ ను  మహేష్ జూనియర్ కు బర్త్ డే గిఫ్ట్ గా రిలీజ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో చర్చావేదికకు తెరతీశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. 

ఆశ్చర్యకరమైన ఈ చర్చలను చూసి మహేష్ అభిమానులు షాక్ అయినట్లు టాక్. మరి జూనియర్ అభిమానులు తెర తీసిన ఈ కామెంట్స్ నిజమే అయితే ‘బ్రహ్మోత్సవం’ సినిమాను మహేష్ అభిమానులతో పాటు జూనియర్ అభిమానులు కూడ చూస్తారు కాబట్టి ఈ సినిమాకు రికార్డులు క్రియేట్ చేయడం ఏమంత కష్టం కాదు అనుకోవాలి. ఈ వార్తలు ఇలా ఉండగా కోస్తా ప్రాంతాన్ని కుదిపేస్తున్న ‘రోను’ తుఫాన్ ప్రభావం ‘బ్రహ్మోత్సవం’ ఓపెనింగ్ కలక్షన్స్ పై ప్రభావం చూపెడుతుందా అన్న భయం ‘బ్రహ్మోత్సవం’ టీమ్ కు టెన్షన్ విపరీతంగా పెరిగి పోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. 

అయితే  తెలంగాణలో ‘బ్రహ్మోత్సవం ‘సినిమాకు ఉదయం అదనంగా ఓ షో వేసుకోవడానికి అవకాశo వచ్చినందు వల్ల నైజాం ప్రాంతంలో ఈసినిమా ఫస్ట్ డే కలక్షన్స్ రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అని అంటున్నారు. నైజాం వరకు ‘బాహుబలి’ కలెక్షన్లను దాటేసినా ఆశ్చర్యం లేదు అని టాక్. 

అయితే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకోని పెద్ద అవాంతరం వచ్చి పడటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈసినిమాకు రోనుతుఫాన్ శత్రువుగా మారిందని వర్షాలు ఆగిపోవాలని ‘బ్రహ్మోత్సవం’ టీమ్  మహేష్ అభిమానులు దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: