‘బ్రహ్మోత్సవం’ విజయం పై ఇంకా ఎటువంటి క్లారిటీ రాకుండానే మహేష్ బాబు వద్ద క్యూ కడుతున్న నిర్మాతల లిస్టులో  ఒక మాజీ హీరోయిన్ కూడ చేరిపోవడం షాకింగ్ న్యూస్ గా మారింది. దీనినిబట్టి చూస్తూ ఉంటే మహేష్ వరస పెట్టి సినిమాలు చేయగలిగితే కనీసం వెయిటింగ్ లిస్టులో మరో పది మంది నిర్మాతలు అతడి ఇంటిముందు క్యూ కట్టినా ఆశ్చర్యం లేదు. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఒకనాటి టాప్ హీరోయిన్ మీనా తన సొంత ప్రొడక్షన్ హౌస్ మొదలు పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బెంగుళూరులో సెటిల్ అయిన మీనా టాలీవుడ్ తో తనకున్న పరిచయాలను దృష్టిలో పెట్టుకుని ఒక టాప్ ప్రొడ్యూసర్ గా మారడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఆమె దృష్టి ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు పై పడింది అని అంటున్నారు. 

తెలుగులో మహేష్ బాబుతో ఒక సినిమా తమిళంలో కమలహాసన్ తో ఒక సినిమా తీయడానికి ప్రస్తుతం ఈమె కథలు వింటోంది అని టాక్. ఈమధ్య కాలంలో ఈమె మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ద్వారా మహేష్ ను కలిసి తాను ఒక సినిమాను నిర్మించడానికి డేట్స్ ఇవ్వవలసిందిగా అడిగినట్లు మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే మహేష్ మురగదాస్ దర్శకత్వంలో త్వరలో మొదలు పెట్టబోతున్న సినిమా తరువాత మహేష్ తో సినిమాలు తీయబోయే దర్శకుల లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పూరి జగన్నాథ్ లు టాప్ ప్రిఫరెన్స్ లో ఉన్న నేపధ్యంలో మీనా ఏ దర్శకుడుతో సినిమాను తీస్తుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అంటున్నారు. 

ఈమధ్య కాలంలో బాలీవుడ్ లో మహిళా నిర్మాతల సంఖ్య బాగా పెరుగుతున్న నేపధ్యంలో అదే స్పూర్తిగా తీసుకుని మీనా కూడ నిర్మాతగా మారి సక్సస్ సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది అనుకోవాలి. అయితే ఈమధ్య విడుదల అవుతున్న టాప్ హీరోల సినిమాలు అన్నీ ఏవరేజ్ హిట్స్ గా మారుతున్న నేపద్యంలో మీనా తన నిర్ణయాన్ని చివరి వరకు కొనసాగిస్తుందా అన్నదే ప్రశ్న..
 


మరింత సమాచారం తెలుసుకోండి: