మెగాస్టార్ అశీస్సులతో మెగా హీరోలు ఎంతమంది వచ్చినా అభిమానులు వారిని సాదరంగా ఆహ్వానిస్తూ తమ అభిమానాన్ని పంచుతున్నారు. ఇక అతి కొద్ది కాలంలోనే మెగా స్టామినా తెలియచేసిన కుర్ర హీరో మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్. రేయ్ ముందు చేసినా పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో హిట్ అందుకున్న ఈ మెగా హీరో రీసెంట్ గా సుప్రీ అంటూ వచ్చి హిట్ కొట్టాడు.


చేసింది నాలుగు సినిమాలు అందులో రెండు హిట్లు, ఒకటి యావరేజ్, మరోటి ఫ్లాప్ ఇలా నాలుగు సినిమాలతో మెగా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి ధరం తేజ్ సుప్రీ సినిమా టోటల్ బడ్జెట్ 15 నుండి 17 కోట్లు కాగా నిర్మాత దిల్ రాజు సినిమాను 25 కోట్లకు మార్కెట్ చేశారు. అయితే ఈ నెల 5న రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది.


ఇక కలక్షన్స్ అయితే సినిమాకు సూపర్ లెవల్లో వచ్చాయట. ఇప్పటికే 20 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందట సుప్రీం సినిమా.. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సుప్రీం సాయి ధరం తేజ్ ను హీరోగా నిలబెట్టడమే కాకుండా తన మార్కెట్ ను కూడా పెంచేసిందని చెప్పొచ్చు. అంతేకాదు మెగా హీరో 20 కోట్ల స్టామినా ఉందని ప్రూవ్ చేసుకున్నాడు సాయి ధరం తేజ్. 


రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన సుప్రీం సినిమా మెగా అభిమానుల ఆశీస్సులతో హిట్ టాక్ సాధించింది. మరి ఇలానే తన కెరియర్లో మరెన్నో సూపర్ హిట్లు కొట్టేలా సాయి ధరం తేజ్ తన కెరియర్ ప్లాన్ చేసుకోవాలని.. స్వతహాగా తనకంటూ ఓ ఇమేజ్ కోసం ప్రయత్నించాలని కోరుకుందాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: