చిరంజీవి హీరోగా నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ తన 150వ చిత్రం. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన అన్నీ ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కేవలం చిరీంజీవి డేట్స్ ని ఇస్తే..వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసుకోవటమే ఆలస్యం. ప్రస్తుతం చిరంజీవి తన మూడు నెలలకి సంబంధించిన డేట్స్ ని అడ్జెస్ట్ చేయటం కోసం అన్ని విధాలుగా రెడీ అవుతున్నాడు. తన పనులకి ఏ మాత్రం అడ్డంకులు రాకుండా చూసుకుంటున్నాడు.


దీంతో త్వరలోనే చిరంజీవి తన షెడ్యూల్ డేట్స్ ని వినాయక్ ఇవ్వనున్నాడు. అయితే ఈ లోపు స్టార్ కాస్టింగ్ లో ఏమైనా మార్పులు ఉంటే..వాటిని సైతం చిత్ర యూనిట్ పరిశీలిస్తుంది. పక్కా ప్లానింగ్ తో రెడీగా ఉన్న వినాయక్ టీం…చివరి నిముషంలో ఓ పాత్రని చోటుకల్పించింది. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ మూవీలో స్టార్ హీరోయిన్ శ్రియ చోటు దక్కించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.


వినాయక్, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ మూవీలో హీరోయిన్ గా శ్రియ నటించింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ ని సాధించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ గా భావించిన వినాయక్….చిరంజీవి 150వ చిత్రంలోనూ హీరోయిన్ శ్రియకి గెస్ట్ ఎప్పీరియన్స్ రోల్ ని ఇచ్చారని తెలుస్తుంది. 5 నిముషాలు పాటు సాగే శ్రియ పాత్ర…కథకి ఎంతో మేలు చేసేదిలా ఉంటుందని అంటున్నారు.


ఈ విషయంపై చిరంజీవి సైతం పాజిటివ్ గా ఉండటంతో…వినాయక్ వెంటనే శ్రియ డేట్స్ ని కన్ఫర్మ్ చేసుకుంటున్నాడని అంటున్నారు. మొత్తంగా చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన కసరత్తులు పకడ్బంధీగా జరుగుతున్నాయని తెలుస్తుంది. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన కత్తి మూవీకి రిమేక్ గా చిరంజీవి 150వ సినిమా తెరకెక్కుతుందనే విషయం తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: