ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం బ్రహ్మోత్సవం. అయితే ఈ మూవీకి సంబంధించిన సక్సెస్ పై వస్తున్న టాక్స్ కి ప్రిన్స్ ఫైర్ అయ్యడానే విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది. సినిమా రిలీజ్ కంటే ముందు తను ఏ ఛానల్స్ లో అయితే పబ్లిసిటినీ ఇచ్చుకున్నాడో..ఇప్పుడు అవే ఛానల్స్ బ్రహ్మోత్సవం మూవీ బాగోలేదంటూ ప్రచారాన్ని చేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు వారిపై ఫైర్ అయ్యాడని అంటున్నారు. సినిమా అనేది బిజినెస్ పాయింట్.


దానికి అందరూ సపోర్ట్ చేయాలి అనేది నేటి నిర్మాతల ఆలోచనలు. ఆ విధంగానే బ్రహ్మోత్సవం మూవీని కొన్ని రోజులు కూడ మీడియా సపోర్ట్ చేయకుండా…ఈ విధంగా నెగిటివ్ స్టోరీలను టెలికాస్ట్ చేయటం ఏ మాత్రం బాగోలేదని అంటున్నారు. దీనికి తోడు సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఎవరికి తోచిన విధంగా వారు రివ్యూలు రాసుకొని…ఇష్టం వచ్చిన రేటింగ్స్ ని ఇచ్చుకున్నారు. ఇలాంటి వారిపై కూడ ప్రిన్స్ ఫైర్ అయ్యాడని తెలుస్తుంది.


ఈ మధ్య కాలంలో ఓ రిపోర్టర్ మహేష్ బాబు ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించగా అది సాధ్యపడలేదంట. దాంతో ఆ రిపోర్టర్..తన ఛానల్ లో బ్రహ్మోత్సవం పై నెగిటివ్ రిపోర్ట్ ని టెలికాస్ట్ చేయించాడు. ఇదికూడ మహేష్ వద్దకి వెళ్ళింది. మీడియా ఛానల్స్ ఈ విధంగా చేయటం సరైన పద్దతి కాదని అంటున్నారు. ఏదేమైనా బ్రహ్మోత్సవం మూవీపై వస్తున్న నెగిటివ్ టాక్స్ కారణంగానే చాలా వరకూ డామేజ్ జరిగిందని అంటున్నారు.


అయితే ప్రస్తుతం మహేష్ బ్రహ్మోత్సవం మూడ్ నుండి బయటకు వచ్చి…మురుగదాస్ పై మూవీపై పనిచేయటం స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ కి సంబంధించిన డేట్స్ కూడ బయటకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: