దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి..ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేక పోతున్నాయి. రోడ్డు రవాణా సంస్థ హైవే రోడ్లపై ఎన్నో రకాలుగా భద్రతా ఏర్పాట్లు చేసినా రోడ్డు ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ రోడ్డు ప్రమాదంలో తమిళ దర్శకుడు డైరెక్టర్ దేవరాజు(60) మృతి చెందారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి దేవరాజు తన స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి హైదరాబాద్ కు బయలుదేరారు.

అయితే బెంగుళూరు నుంచి కొన్ని పనులు చూసుకొని హైదరాబాద్ కు వస్తుండగా డోన్ హైవే ఓబులాపురం మిట్ట వద్ద కారు ప్రమాదం సంబవించింది. ఈ ప్రమాదంలో దర్శకులు దేవరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు కారులో ప్రయాణిస్తున్న అతని స్నేహితులు కూడా తవ్రంగా గాయాలు అయ్యాయి. కాగా  దేవరాజు మృతదేహాన్ని కోయంబత్తూరుకు తరలించారు.

గతంలో రాంకీ, నిరోషా హీరోహీరోయిన్లుగా  ‘సిందూర పువ్వు’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది...అందులో పాట ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. ప్రస్తుతం తమిళ సీరియల్స్ కు డైరెక్టర్ గా ఉన్న దేవరాజు మృతిపై సినీ రంగ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: