ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకేలా ఆలోచించారంటూ క్లియర్ టాక్స్ వస్తున్నాయి. అయితే ఏదైనా షూటింగ్ భారీ షెడ్యూల్ తరువాత ఈ ఇద్దరూ హీరోలు కచ్ఛితంగా ఓ ఫారిన్ ట్రిప్ వెళతారు. కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ సినిమా మధ్యలోనూ వెళతారు. ఏకధాటిగా 20 రోజుల షెడ్యూల్  జరిగిందంటే చాలు, కాస్త రిలాక్స్ అనేది అవసరం కాబట్టి…పవన్ కళ్యాణ్ వెంటనే ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటారు. అయితే ప్రిన్స్ అలా కాదు.

ఓ సినిమాకి సంబంధించిన పూర్తి షూటింగ్ పూర్తయిన తరువాత తను ఎబ్రాడ్ వెళతారు. కొన్ని సందర్భాల్లో సక్సెస్ మీద కాన్ఫిడెంట్ ఉంటే సినిమా రిలీజ్ అయిన తరువాత దాని రిజల్ట్ తెలుసుకొని వెళతారు. ఇప్పుడు కూడ బ్రహ్మోత్సవం మూవీ అన్నీ చోట్ల మంచి కలెక్షన్స్ ని సాధిస్తుంది కాబట్టి…దీన్ని సెలబ్రేషన్స్ చేసుకోవటానికి, అలాగే రిలీఫ్ అవ్వటానికి లండన్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరూ హీరోలు విదేశాల్లో ఎంచక్కా జాలీ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమాను త్వరలోనే  సెట్స్‌ పైకి తీసుకెళ్ళనున్నారు. ఎస్.జె.సూర్యతో కలిసి పవన్ చేయబోయే సినిమా ఓ ఫ్యాక్షన్ లవ్‍స్టోరీ అని అంటున్నారు. మహేష్ బాబు సైతం ఫారిన్ నుండి తిరిగి వచ్చాక మురుగదాస్ మూవీకి సంబంధించిన పనుల్లో బిజి కానున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ దాదాపు చివరి దశకు చేరుకుంది.

అందుకే ఈ మూవీకి సంబంధించిన ప్రతి పనిని మురుగదాస్ ప్రత్యేకమైన శ్రద్ధతో నిర్వహిస్తున్నారు. కథకి సంబంధించిన దానిపై మురుగదాస్, మహేష్ ఇద్దరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొత్తంగా ఇద్దరు టాప్ హీరోలు విదేశాల్లోకి వెళ్ళటంలో ఇండస్ట్రీలో కొంత హడావిడి తగ్గినట్టుగా అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: