ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం బ్రహ్మోత్సవం. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన టాక్స్ ని చూస్తూ అన్ని చోట్ల నుండి కామెడీ సెటైర్స్ తో హోరెత్తిపోతుంది. నిజానికి ఈ సినిమా ఓ ప్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథాంశంతో ఉన్న చిత్రం. ఈ చిత్రానికి మహిళా ప్రేక్షకుల ఆధరణ ఎక్కువుగా ఉంది. కానీ మేల్ ఆడియన్స్ మాత్రం ఈ మూవీని ఇష్టపడే పరిస్థితి ఎక్కడా కనిపించటం లేదు.


దీంతో బ్రహ్మోత్సవం మూవీని డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల సైతం ఎక్కడా ప్రస్తుతం కనిపించటం లేదు. బ్రహ్మోత్సవం మూవీపై వస్తున్న నెగిటివ్ పబ్లిసిటిని ఏ విధంగా ఓవర్ కం చేయాలి అన్న దానిపై దర్శకుడు, చిత్రయూనిట్ పూర్తిగా విఫలం అయిందని చెప్పాలి. రెండో షో కే బ్రహ్మోత్సవం మూవీపై వచ్చిన నెగిటివ్ టాక్స్, రెండో రోజుకి సోషియల్ మీడియాలో చెలరేగిపోయింది.


మొదటిరోజే ఇటువంటి టాక్స్ కి చిత్ర యూనిట్ చెక్ పెట్టిఉంటే సాధరణ ప్రేక్షకుల్లో ఈ మూవీకి మంచి ఒపినియన్ ఉండేదని అంటున్నారు. ఇదిలా ఉంటే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబుని కలవాలని చూసినప్పటికీ…రిలీజ్ తరువాత నుండి ఇప్పటి వరకూ ఆ ఛాన్స్ కుదరలేదని అంటున్నారు. మహేష్ బాబు, మురుగదాస్ కి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ లో బిజిగా ఉన్నారని, అలాగే ఫారిన్ ట్రిప్ మూడ్ లో ఉన్నారని శ్రీకాంత్ కి సమధానం వస్తుందని అంటున్నారు.


దీంతో వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ డిస్టన్స్ పైనా టెలివిజన్స్ లో ప్రత్యేకమైన స్టోరీలు ప్లే అవుతున్నాయి. మొత్తానికి బ్రహ్మోత్సవం మూవీ ఫ్యామిలీ ఫ్లేవర్ సాధారణ ప్రేక్షకులకి ఏ మాత్రం సంతోషాన్ని ఇవ్వలేకపోయిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: