ప్రపంచంలో ఎప్పటికైనా నాశనం చేయలేనికి, తయారు చేయలేనిది అంటూ ఏదైనా ఉంది అంటే అది ఒకే భూమి మాత్రమే. అవును..కొత్త ల్యాండ్ ని క్రియేట్ చేయలేము…ఉన్న ల్యాండ్ ని నాశనం చేయలేము. అందుకే ఈ సత్యాన్ని తెలుకున్న చాలా మంది …రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకుంటారు. వారి దగ్గర ఉన్న మనీలో కొంత భాగాన్ని రియల్ ఎస్టేట్ పై పెడుతుంటారు. అలా స్టార్ హీరోలు, హీరోయిన్స్ సైతం ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ పై ఓకన్నేశారు.

ముఖ్యంగా బాలీవుఢ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు రియల్ ఎస్టేట్ రంగంలో శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఓ మూవీని చేశారు అంటే చాలు…దాని ద్వారా వచ్చే డబ్బులతో ముంబాయ్ లో ప్లాట్స్ ని కొనేసుకుంటున్నారు. అలాగే వాటికి రేటు వస్తే..వెంటనే అమ్మేసుకుంటున్నారు. ఇలా 2015, 2016 సంవత్సరాలలో బాలీవుడ్ కి చెందిన ప్రముఖ హీరోలు ఈ రియల్ ఎస్టేట్ లోకి జోరుగా వచ్చేస్తున్నారు.

వారికి సంబంధించిన వివరాలను చేస్తే….తాజాగా రణ్ భీర్ కపూర్ 37 కోట్లరూపాయలతో ఓ ప్లాట్ ని కొన్నాడు. అలాగే అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్ర, కత్రినాకైఫ్, అనుష్క శర్మ వంటి వారు అందరూ దాదాపు 40 కోట్ల రూపాయలో ప్లాట్స్ ని కొన్నారు.

వీరిలో చాలా మంది ఇలా కొన్న వాటికి మంచి రేటుకి అమ్మేసుకున్నారు కూడ. వరుస సినిమాలతో వీరు భారీ రెమ్యునరేషన్ తీసుకోవటంతో  వచ్చిన డబ్బుని ఇలా  రియల్ ఎస్టైట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే ట్రెండ్ గా మారిందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: