ఈ మద్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో హర్రర్ చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా హర్రర్ చిత్రంలో భయంకర దృశ్యాలు చూపిస్తూ భయకింపితులను చేస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు ఉండటంతో ఇలాంటి చిత్రాలకు బాగా ఆకర్షితులవుతున్నారు ఆడియన్స్. అయితే తెలుగులో గతంలో విఠలాచార్య హర్రర్ చిత్రాల్లో ఇలాంటి కామిడీ సన్నివేశాలు బాగా ఉండటంతో అప్పట్లో ఆ సినిమాలు బాగా నడిచేవి. జగన్మోహిని, మదన మంజరి లాంటి సినిమాలులో పొట్టి దెయ్యాలు పెట్టి కడుపుబ్బా నవ్వించారు.

జీరో చిత్రంలో ఓ దృశ్యం


ఈ మద్య కాలంలో ఇదే కాన్సెప్ట్ తో లారెన్స్ ముని చిత్రం ద్వారా ఓ వైపు హర్రర్ చూపిస్తూనే కామెడి పండించారు..దీంతో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది..ఇక ఇదే కాన్సెప్ట్ తో కాంచన, గంగ లాంటి సినిమాలు తీసి మంచి విజయం సాధించారు. ఇదే కోవలోకి చంద్రకళ,త్రిపుర, రాజుగారి గది లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి.

జీరో చిత్రంలో ఓ దృశ్యం


తాజాగా శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'జీరో' టీజర్ విడుదలైంది. ఈ చిత్రం  రొమాంటిక్ థ్రిల్లర్ గా తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ పెద్ద సక్సెస్ ను సాధించింది. ఈ చిత్రానికి శివ్ మోహ(అరుణ్ కుమార్) దర్శకత్వం వహించారు. గ్యాంబ్లర్, సెవెన్త్ సెన్స్ చిత్రాల్లో నటించిన అశ్విన్, శివేద జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం: నివాస్ కె.ప్రసన్న, సినిమాటోగ్రఫీ: బాబుకుమార్, ఎడిటింగ్: సుదర్శన్, నిర్మాణం: శ్రీ చక్ర ఇన్నోవేషన్స్.ప్రస్తుతం ఈ టీజర్‌ హల్‌చల్‌ చేస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: