విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కొద్ది పాటి గ్యాప్ తర్వాత వెంకీ చేస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక 80 శాతం వరకు పూర్తయిన ఈ సినిమా జూన్ 2న టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.


అంతేకాదు గిబ్రాన్ అందిస్తున్న ఈ సినిమా ఆడియోను జూన్ 6న భారీ రేంజ్ లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయట. వెంకీ మార్క్ కామెడీతో ఈ సినిమా అద్భుతంగా వస్తుందని చిత్రయూనిట్ అంటున్నారు. సితారా క్రియేషన్స్ బయానర్ తో కలిసి సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూలై 1న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.


బాబు బంగారంలో వెంకటేష్ :


గోపాల గోపాల తర్వాత వెంకటేష్ నటిస్తున్న ఈ సినిమా కచ్చితంగా సూపర్ సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. ఒకప్పుడు విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న వెంకీ ఈ మధ్య సినిమాలను చేయడంలో వెనుకడుగు వేశాడు. అయితే ఇప్పుడు ఆ గ్యాప్ ను కవర్ చేసేందుకు స్పీడ్ అప్ చేస్తున్నాడట. చేస్తున్న బాబు బంగారం పూర్తి కాగానే క్రాంతి మాధవ్ తో ఓ సినిమాకు రెడీ అవుతున్న వెంకటేష్ ఆ తర్వాత పూరి దర్శకత్వంలో చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 


మరో విశేషం ఏంటంటే పూరి మెగాస్టార్ చిరంజీవికి రాసుకున్న ఆటో జాని కథే వెంకటేష్ తో తీసే కథ అంటూ ప్రచారం జరుగుతుంది. మరి చిరు కాదన్న కథతో వెంకటేష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. ప్రస్తుతానికైతే బాబు బంగారంతో వెంకీ మరోసారి సూపర్ హిట్ కొడతాడనే నమ్ముతున్నారు ఆయన అభిమానులు.



మరింత సమాచారం తెలుసుకోండి: