మల్టీస్టారర్ సినిమాల క్రేజ్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్స్ కు కొత్త ట్రెండ్ క్రియేట్ అవుతుంది. అదే క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకే సినిమాలో నటిస్తున్నారట. మరి ఆ సినిమా దర్శకుడు ఎవరంటే బ్లాక్ బస్టర్ బోయపాటి శ్రీనివాస్. ఓ ఇంకే సినిమా సూపర్ హిట్టే మరి.   


స్పీడున్నోడులో బెల్లంకొండ శ్రీనివాస్ :


అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉందండి.. అసలు సినిమాలో హీరో వీరిద్దరు కాదు. మరి వీరిద్దరి సినిమా కానప్పుడు వీరు ఎందుకు నటిస్తున్నారు అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను తీస్తున్న సినిమా త్వరలో షూటింగ్ జరుగబోతుంది. అయితే ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, బన్ని లను గెస్ట్ రోల్ చేయించే ఏర్పాట్లు చేస్తున్నాడట బోయపాటి శ్రీను.


బెల్లంకొండ సురేష్ తో మంచి అనుభంధం ఉన్న వీరిద్దరి తన కొడుకు సినిమాలో కనబడితే సినిమాకు కాస్త హైప్ వస్తుందని వారి ఆలోచన. ఇక సరైనోడుతో సూపర్ హిట్ కొట్టిన బోయపాటి రాబోయే సినిమాను కూడా అంతే హిట్ కొట్టేందుకు ఈ ప్లాన్ వేశాడు. నైజాం లో డిస్ట్రిబ్యూషన్ రంగంలో అనతి కాలంలోనే సూపర్ క్రేజ్ సంపాదించిన అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారట.


స్పీడున్నోడు సెట్స్ లో భీమననేని, బెల్లంకొండ శ్రీనివాస్, సోనారికా :


మరి బోయపాటి సినిమాలో ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ ఎంతసేపు కనబడతారో కాని.. ఇది వారిద్దరి తీసే మల్టీస్టారర్ సినిమాగా మాత్రం చెప్పుకోవచ్చు. ఇక ఈ విషయాన్ని గురించి బోయపాటి తానే స్వయంగా వెళ్లడిస్తారట. రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో ఉన్నాడు బెల్లంకొండ వారసుడు శ్రీనివాస్.



మరింత సమాచారం తెలుసుకోండి: