ప్రిన్స్ మహేష్ బాబుతో శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ని అందుకున్న కొరటాల శివ, ఇప్పుడు  జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న మూవీనే ‘జనతా గ్యారెజ్’. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారింది. ఎందుకంటే ‘జనతా గ్యారెజ్’ లో రోజుకో కొత్త ఆర్టిస్ట్ వెలుగులోకి వస్తున్నారు. అయితే ఈ ఆర్టిస్ట్ లు తెలుగుకి సంబంధించిన వారు కాదు.


ఇతర భాషలకి సంబంధించిన పెద్ద ఆర్టిస్ట్ లను కొరటాలశివ, ‘జనతా గ్యారెజ్’ మూవీలోకి తీసుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారాలన్నీ చూస్తున్న సీనియర్ యాక్టర్, కొరటాల శివ చాలా ఓవర్ చేస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్ చాలా సరదాగా చేసినప్పటికీ…ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో సీరియస్ గా స్ప్రెడ్ అయ్యింది. ‘జనతా గ్యారెజ్’ మూవీలో కొరటాల ఓవర్ చేస్తున్నాడంటూ అందరి నుండి కామెంట్స్ వస్తున్నారు.


దీంతో ఇది మూవీకి నెగిటివ్ పబ్లిసిటీని తీసుకువచ్చే ప్రమాధం ఉందని అంటున్నారు. ఇప్పటికే ‘జనతా గ్యారెజ్’మూవీలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోండగా, తాజాగా మరాఠీ సినీ పరిశ్రమ నటుడు సచిన్ కేడ్కర్ సైతం విలన్ గా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ‘జనతా గ్యారెజ్’ మూవీకి క్రేజ్ ని తీసుకురావటం కోసమే….కొరటాల శివ ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులతో ఈ విధంగా యాక్ట్ చేయిస్తున్నాడని అంటున్నారు.


అయితే వీరు కథకి ఎంత వరకూ ముఖ్యం, చిన్న సీన్స్ కోసమే కొరటాల వీళ్ళని ఉఫయోగిస్తారేమో? అనేది అందరిలోనూ డౌట్ ఉంది. అలా కాకుండా ‘జనతా గ్యారెజ్’ మూవీ బిజినెస్ ని పెంచుకోవటం కోసం వీళ్ళని తీసుకుంటున్నారా? అనేది కూడ కొందరిలో టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: