సినిమా రంగంలో అడుగు పెట్టిన ప్రతీ నటుడు పై వారివారి స్థాయిలను  బట్టి ఏదో ఒక రూమర్స్ వస్తూనే ఉంటాయి. కొంతమంది వాటిని పట్టించు కోనట్టు ప్రవర్తిస్తూ ఉంటే మరి కొందరు తమ పై వచ్చిన గాసిప్పులను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ రూమర్స్ ఎప్పుడు ఎలా ఎందుకు పుడతాయో అన్న విషయమై క్లారిటీ లేకపోయినా వీటిని డీల్ చేయడంలో మెగా ఫ్యామిలీకి స్పెషల్ రూట్ ఉంది అని అంటారు. 

అదేమిటంటే ఎన్నిరకాల రూమర్స్  వచ్చినా అసలు రియాక్ట్ కాకపోవడమే.  మొదట్లో  రామ్ చరణ్ కాస్త స్పందించేవాడు. అయితే పరిస్థితులను అర్ధం చేసుకుని చరణ్ కూడ తన పై వస్తున్న గాసిప్పులకు స్పందించడం మానేసాడు. ఇదే పద్ధతి ఇప్పుడు మెగా యంగ్ హీరోలు అంతా అనుసరిస్తున్న నేపధ్యంలో  సాయిధరమ్  తేజ్ కూడ అదే రూట్ లోకి వచ్చి ఈమధ్య తన పై వస్తున్న రూమర్స్ పై విలక్షణంగా స్పందించాడు. 

వరుస హిట్స్ పై దూసుకు పోతున్న ఈ మెగా మేనల్లుడి అఫైర్స్ పై ఇప్పటికే చాల రూమర్స్ వచ్చాయి. అయితే వాటిపై ఈ ‘సుప్రీమ్’ ఇచ్చిన ఆన్సర్ వింటే మైండ్ బ్లాంక్ అవాల్సిందే. ‘రూమర్స్ కు రియాక్ట్ అయితే మనల్ని డిస్టర్బ్ చేసినందుకు వాళ్లు చాలా సంతోషిస్తారు. వాటిని పట్టించుకోకపోతే వీటిని కేర్ చేయలేదనే సంతృప్తి ఉంటుంది. పేపర్లు నింపుకోవడానికి రకరకాలుగా రాస్తుంటారు. నేనిక్కడకి పని చేయడానికి వచ్చాను. నన్ను డిస్టర్బ్ చేసే వాళ్ల కోసం కాదు' అంటూ  సాయి ధరమ్ తేజ్ చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. 

ఇది ఇలా ఉండగా ‘బ్రహ్మోత్సవం’ సూపర్ ఫెయిల్యూర్ టాక్ మధ్య మహేష్ అభిమానుల చేత టార్గెట్ అవుతున్న శ్రీకాంత్ అడ్డాల దృష్టి ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ పై పడింది అని టాక్. ఈ యంగ్ హీరోకు శ్రీకాంత్ అడ్డాల ఒక డిఫరెంట్ కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని టాక్. ఫెయిల్యూర్ డైరెక్టర్స్ ను ఎంకరేజ్ చేయడంలో ముందు ఉండే సాయి ధరమ్ తేజ్ శ్రీకాంత్ అడ్డాల బుట్టలో పడితే అది సంచలనమే అవుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: