పవన్ తన భార్య అనా లెజ్నెవాతో కలిసి ‘అత్తారింటి’ దారి పట్టిన పవన్ తన సమ్మర్ హాలిడేస్ ట్రిప్ ను ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే ఈసారి తన భార్య పిల్లలతో కాకుండా పవన్ ఒంటరిగా ఒక ప్రదేశానికి వెళ్ళడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. దీనితో పవన్ ఈ దేశంలోనే ఉన్నాడా ? లేక విదేశాల బాట పట్టాడా ? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

పవన్ ప్రస్తుతం వెళ్ళిన అజ్ఞాత ప్రదేశం వివరాలు అతడి సన్నిహితులకు కూడ పూర్తిగా తెలియదు అని టాక్. పవన్ సహజంగానే ఒంటరిగా గడపడానికి ఇష్టపడతాడు అని అంటారు. అప్పుడప్పుడూ ఒక్కడే విదేశాలకు వెళ్లి వస్తుంటాడు అన్న మాటలు కూడ ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ పవన్ ఇలా తనకు నచ్చిన ప్రాంతంలో రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళి ఉంటాడని అని అంటున్నారు.

పవన్ ఈ ట్రిప్ నుంచి తిరిగి రాగానే ఎస్.జె.సూర్య దర్శకత్వంలో చేయాల్సిన కొత్త సినిమాకు సంబంధించిన రంగం అంతా సిద్ధం అయింది. తనకు బాగా సెంటిమెంట్ రీత్యా కలిసి వచ్చే పొల్లాచ్చిలో ఈసినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది అని ఇప్పటికే వార్తలు ఉన్నాయి. ఈసినిమా చేస్తూ ఉండగానే పవన్ వరుసగా సినిమాల్లో నటించబోతున్నాడు అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి. 

నిర్మాత ఏ.ఎం. రత్నంకు పవన్ కాల్షీట్స్ ఇచ్చాడని సమాచారం. ఈసినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో పవన్ ఇంత స్పీడ్ గా సినిమాలు చేస్తాడా అని అతడి సన్నిహితులు కూడ షాక్ అవుతున్నట్లు టాక్. రానున్న 2 సంవత్సరాలలో 4గు సినిమాలు వరసగా చేయాలి అని పవన్ తీసుకున్న లేటెస్ట్ నిర్ణయo ఎంత వరకు వాస్తవ రూపం దాలుస్తుంది అన్న విషయం పై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: