మహేష్ తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడికి ఉంటుంది. సూపర్ స్టార్ లాంటి హీరోతో సినిమా చేయాలంటే సరైన కథ కథనాలతో ముందుకెళ్లాలి. అయితే ప్రస్తుతం బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో షాక్ తిన్న మహేష్ స్టోరీ ఫైనల్ చేసే నిర్ణయంలో మరింత జాగ్రత్తలు తీసుకోనున్నాడని తెలుస్తుంది. అంతేకాదు తనతో సినిమా చేద్దామనుకున్న తమిళ దర్శకుడికి షాక్ ఇచ్చాడట మహేష్.


దర్శకుడు అట్లీ :


కోలీవుడ్ లో కుర్ర దర్శకుడే అయినా కెరియర్ లో రెండో సినిమానే విజయ్ తో తేరి అంటూ తీసి హిట్ కొట్టిన దర్శకుడు అట్లీ. తను తీసిన మొదటి సినిమా తెలుగులో రాజా రాణి టైటిల్ తో వచ్చి ఇక్కడ సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే ఈ దర్శకుడికి మహేష్ తో సినిమా చేయాలని కోరికట. విజయ్ పోలీస్ సినిమా ప్రమోషన్స్ కు వచ్చినప్పుడు మహేష్ కు కథ వినిపించాడట అట్లీ.. అయితే కథ పర్వాలేదనిపించినా తేరి రిజల్ట్ ను బట్టి నిర్ణయం చెబుదామని ఆలోచించి చెబుతా అన్నాడట మహేష్. 


అయితే బ్రహ్మోత్సవం ఇచ్చిన షాక్ వల్ల మహేష్ ప్రస్తుతం ప్రయోగాలకు దూరం గా ఉండాలని డిసైడ్ అయ్యాడట. హాలీడేస్ నుండి తిరిగి రాగానే మురుగదాస్ సినిమా చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నాడు మహేష్. ఇక ఈ క్రమంలో అట్లీకు కుదరదని చెప్పేశాడట మహేష్. అందుకే కార్తి హీరోగా సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట అట్లీ.


పోలీస్ షూటింగ్ స్పాట్ లో అట్లీ, విజయ్ :


అంతేకాదు తెరి విజయంతో విజయ్ కూడా అట్లీ విషయంలో ఇంప్రెస్ అయ్యాడు కాబట్టి.. తెరి-2 కూడా తీసే ఆలోచనలో ఉన్నాడట విజయ్. ఒకవేళ అదే నిజం అయితే విజయ్ హీరోగా అట్లీ రెండో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే. మరి అట్లీ కు పంచ్ ఇచ్చిన మహేష్ ప్రస్తుతం పరిస్థితుల్లో మంచి పని చేసినా.. సబ్జెక్ట్ గట్టిగా ఉంటే కుర్రాడితో చేసే అవకాశాలు లేకపోలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: