టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రాఫిక్స్ ఓరియంటెడ్ చిత్రాలను తీయాలంటే మొదటగా గుర్తుకువచ్చేది రాజమౌళి. ఎందుకంటే ఈ తరహా చిత్రాలను ప్రయత్నించి, ఇప్పటికే పలుసార్లు సక్సెస్ అయిన డైరెక్టర్ ఒక్క రాజమౌళినే. మగధీర, ఈగ, బాహుబలి వంటి చిత్రాలు రాజమౌళి స్థాయిని పెంచేశాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాజమౌళిని మించేలా ఓ మూవీ రెడీ అవుతుంది. ఆ మూవీ హిట్ అయితే, రాజమౌళి సరసన తన పేరు కూడ చేరిపోవటం ఖాయం.  


జాతీయఅవార్డు గ్రహీత క్రిష్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ ఎక్కువ భాగం గ్రాఫిక్స్ తోనే ఉంటాయి. దీంతో గౌతమీపుత్ర శాతకర్ణి మూవీని బాక్సాపీస్ వద్ద బ్లాక్ బస్టర్ చేస్తే...రాజమౌళికి ఎంతంటి పేరు వచ్చిందో....క్రిష్ కి సైతం అంతటి గుర్తింపు రావటం ఖాయం అని అంటున్నారు.


ఈ విషయం క్రిష్ కి కూడ తెలుసు. అందుకే గౌతమీపుత్ర శాతకర్ణి మూవీని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకునే మొరాకోలోని అద్భుతమైన లోకేషన్స్ నడుమ గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ని పూర్తి చేశాడు క్రిష్. మొరాకాలోని అట్లాస్ స్టూడియోస్, వరు జార్జియస్ లో గౌతమీపుత్ర శాతకర్ణి కీలక సన్నివేశాలను చిత్రీకరించుకుంది.


బాలకృష్ణ, కబీర్ బేడికి మధ్య యుద్ధ సన్నివేశాలను ఇందులో చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ విశేషాలను తెలుసుకున్న రాజమౌళి, ఒక్కసారిగా షాక్ అయ్యాడని అంటున్నారు. ఎందుకంటే, డైరెక్టర్ క్రిష్...ఇంతటి భారీ షెడ్యూల్ ని చాలా సింపుల్ గా ఫినిష్ చేశాడంట. ఏ మాత్రం టెన్షన్ లేకుండా క్రిష్ షెడ్యూల్ ని పూర్తి చేసిన విధానం..రాజమౌళికి ఆశ్ఛర్యాన్ని కలిగించిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: