తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన మెగా హీరో పవన్ కళ్యాన్..అయితే అన్నయ్య బ్యాగ్ గ్రౌండ్ ఉపయోగించుకోకుండా తనకంటూ ఓ ప్రత్యేమైన ఇమేజ్ ఏర్పాటు చేసుకొని అభిమానుల మెప్పు పొందాడు పవన్ కళ్యాన్. ఇక తమ్ముడు, జల్సా, ఖుషి చిత్రాలతో తన మేనరీజంతో యాక్షన్ తో అద్భుతమైన విజయాలు సాధించి మంచి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక ‘గబ్బర్ సింగ్’ పవన్ కళ్యాన్ కెరీర్ ఓ రేంజ్ లో మలుపు తిప్పింది..అప్పటి నుంచి మాస్ ఇమేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ మద్య ఎన్నో అంచనాలతో వచ్చిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ అపజయం కావడంతో పవన్ ఫ్యాన్ బాగా నిరుత్సాహ పడ్డారు.

త్రివిక్రమ్, పవన్ కళ్యాన్


అయితే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కి గొప్ప శుభవార్త..! అప్పట్లో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాన్ కి ‘జల్సా’ లాంటి సూపర్ హిట్ అందించిన త్రివిక్రమ్ తర్వాత ‘అత్తారింటికి దారేది’ లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాన్ని అందించి మరో ఘనవిజయాన్ని పవన్ ఖాతాలో వేశారు. తర్వాత వీరి మద్య కాస్త గ్యాప్ ఎక్కువే అయ్యింది..కానీ ఇద్దరు మంచి ఆప్తమిత్రులు వీరి స్నేహం  ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా భారి ప్లాప్ తో బాగా డిసప్పాయింట్ అయిన మెగా అభిమానులకు మల్లి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్.

తాజాగా మరోసారి త్రివిక్రమ్, పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది..ఆ సినిమాకు దాసరి నారాయణరావు నిర్మాణ సారధ్యం వహించబోతున్నాడు. అయితే  ఈ సినిమాకు ముందు పవన్ కెరీలో మరో గొప్ప సినిమా అయిన ‘ఖుషి’ చిత్రం డైరెక్టర్ ఎస్.జే.సూర్యతో సినిమాకు కమిట్ మెంట్ అయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటి వారంలో ప్రారభం కానుంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్,పవన్ కాంబినేషన్ లో కొత్త చిత్రా రాబోతుందట. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తీ అయిన ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం.

ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాలని దాసరి కోరాడట, తన బ్యానర్ లో మంచి క్రేజ్ సినిమా తీయాలని దాసరి కోరడంతో త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పాడట, జల్సా , అత్తారింటికి దారేది సినిమాల తరువాత పవన్ , త్రివిక్రమ్ లు హట్రిక్ కోసం రెడీ అవుతున్నట్టే.. మరి పవన్ ఫ్యాన్స్ ఇది గుడ్ న్యూస్ కదా..!


మరింత సమాచారం తెలుసుకోండి: