అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరక్కెకిన సరైనోడు చిత్రం భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు బోయపాటి, బన్నీ మొక్కును చెల్లించుకునేందుకు సింహాచలం వెళ్ళారు. దైవ దర్శనానికి వెళ్లిన సినీ హీరో అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీను లిఫ్ట్‑లో ఇరుక్కుపోయారు.

 

సింహాచలం వరాహ నరసింహస్వామి దర్శించుకునేందుకు వెళ్లిన వీరికి శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. దర్శన అనంతరం  అల్లు అర్జున్, బోయపాటి లిఫ్ట్ ఎక్కగా, సాంకేతిక లోపంతో సగంలో నిలిచిపోయింది. వీరితో పాటు అభిమానులు కూడా పరిమితికి మించి ఎక్కేయడంతో లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు.

 

ఆలయ భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి లిఫ్ట్‌ తలుపులు బద్దలుకొట్టి వారిని బయటకు తీశారు. అనంతరం వారు అక్కడి నుంచి కొండ కిందికి వెళ్లిపోయారు. మరోవైపు సెక్యూరిటీ సిబ్బంది కల్పించుకుని అభిమానులను నిలువరించారు.  కాగా బన్నీ, బోయపాటి కాంబినేషన్‑లో వచ్చిన 'సరైనోడు' చిత్రం విజయవంతమైన విషయం తెలిసిందే. దీంతో వారు అప్పన్నకు మొక్కు చెల్లించుకునేందుకు వెళ్లారు. దర్శనం అనంతరం వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందచేశారు. . అనంతరం వారు అక్కడి నుంచి కొండ కిందికి వెళ్లిపోయారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: