గత కొద్ది రోజులుగా అఖిల్ రెండవ సినిమా ప్రాజెక్ట్ నుండి దర్శకుడు వంశీ పైడి పల్లి తప్పుకున్నాడు అంటూ మీడియాలో వార్తలు తెగ వచ్చాయి. అయితే ఈ వార్తలు చూసి అఖిల్ అసహనం వ్యక్తం చేయడమే కాకుండా తాను వంశీ పైడిపల్లితో సినిమాను చేయడం ఖాయం అంటూ మీడియాకు లీకులు కూడ ఇచ్చాడు. దీనితో ఈ విషయం సద్దు మణిగింది అనుకున్నారు అంతా. 

అయితే ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ లాస్ లు సద్దుబాటు చేయడానికి మహేష్ పివిపి సంస్థకు వచ్చే సంవత్సరం చేయబోయే మరో సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతను స్వయంగా మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లికి అప్పచెప్పినట్లు ఫిలింనగర్ టాక్. మహేష్ లండన్ వెళ్లబోయే ముందు వంశీ పైడి పల్లికి కాల్ చేసి ఒక మంచి స్క్రిప్ట్ ను తయారు చేయమని మహేష్ స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు టాక్. 

దీనితో అఖిల్ వంశీ పైడిపల్లిల కాంబినేషన్ లో రాబోయే సినిమా ఇక శాస్వితంగా అటక ఎక్కినట్లే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అఖిల్ రెండవ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడు అని నాగార్జున ఓపెన్ గా ప్రకటించాక కూడ వంశీ పైడిపల్లి ఇప్పుడు ఇలా మరో ట్విస్ట్ ఇచ్చి మహేష్ వైపు వెళ్ళి పోవడం తీరని అవమానంగా అక్కినేని కాంపౌండ్ భావిస్తున్నట్లు టాక్. 

అఖిల్ కోసం ఒక కథను వంశీ పైడిపల్లి తయారు చేసినా ఆ సినిమాను నిర్మించే మైత్రి మూవీస్ ఆ కథకు అయ్యే భారీ  బడ్జెట్ కు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అఖిల్ తో వంశీ మొదలు పెట్టవలసిన మూవీ ప్రాజెక్ట్ ఆగి పోయిన విషయం తెలిసిందే. అయితే అఖిల్ కోసం మరో కధను ఆలోచిస్తాను అని వంశీ పైడిపల్లి విదేశాలకు వెళ్ళిపోయి ఆక్కడ అఖిల్ సినిమా గురించి ఆలోచించకుండా ఇప్పుడు మహేష్ వైపు వంశీ టర్న్ తీసుకోవడం నాగార్జున కు షాకింగ్ న్యూస్ గా మారింది అని టాక్. ఏమైనా మహేష్ కారణం గా అఖిల్ ఆశలకు గండి పడింది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: