పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ సర్ధార్ గబ్బర్ సింగ్. గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీకి ఇది సీక్వెల్ గా వచ్చి, బాక్సాపీస్ వద్ద ఆశించినంత సక్సెస్ ని సాధించలేకపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా, ఫ్యాన్స్ సైతం కొంత నిరుత్సాహపడ్డారు.అయితే ఈ ఎఫెక్ట్ నుండి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ వెంటనే ఎస్.జె.సూర్య మూవీకి ముహుర్తం పెట్టేశాడు.


ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ శరవేంగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ డైరెక్టర్..పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా వచ్చారని అంటున్నారు. సోషియల్ మెసేజ్ కి సంబంధించిన ఓ మూవీలో తనని హీరోగా తీసుకోవాలని ఆ డైరెక్టర్ ఉద్ధేశంలా అనిపిస్తుందని అంటున్నారు.


సౌతిండియాకి సంబంధించిన పొలిటికల్ నేపథ్యంలో ఈ మూవీ సాగనుందని అంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ ఉన్న కథానాయకుడుగా పవన కళ్యాణ్ అని తెలుసుకున్నాడంట. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్, తన నిజాయితీ ఈ మూవీకి బాగా ఉపయోగపడుతుందని తను భావించాడు. అందుకే బాలీవుడ్ కి చెందిన ఆ డైరెక్టర్  పవన్ తో ఇప్పటికే చర్ఛలు జరిపారని అంటున్నారు.


దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ స్వయంగా  ఈ విషయాన్ని బయటకు చెప్పేందుకు ఆసక్తిగా ఉన్నాడని అంటున్నారు. సూర్య కి సంబంధించిన డైరెక్షన్ లో నటిస్తూనే, బాలీవుడ్ డైరెక్టర్ మూవీలోనూ ఏకకాలంలో పాల్గొనే ఛాన్స్ ఉందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: