యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘జనతా గ్యారెజ్’. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అనుకున్న దాని కంటే షెడ్యూల్స్ ని చాలా స్పీడుగా పూర్తి చేస్తున్నాడు దర్శకుడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ‘జనతా గ్యారెజ్’ టీం రీలీజ్ చేసింది. ‘జనతా గ్యారెజ్’ ఫస్ట్ లుక్ పై అంతటా అంచనాలు పెరిగిపోవటంతో...ఈ మూవీకి సంబంధించని ఫస్ట్ టీజర్ పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దీంతో ‘జనతా గ్యారెజ్’ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని మే 28న రిలీజ్ చేయాలని చూశారు. కానీ చివరి నిముషంలో టీజర్‌ను విడుదల చేయట్లేదని చిత్రయూనిట్ తెలిపింది. ఇందుకు కారణాలుగా పోస్ట్ ప్రొడక్షన్ సరిగా కాకపోవటం వంటివి జూనియర్ కి కనిపించాయి. దీంతో ‘జనతా గ్యారెజ్’ మూవీ ఫస్ట్ టీజర్ ని అభిమానులకి ప్రామిస్ చేసినట్టుగా అనుకున్న టైంకి రిలీజ్ చేయలేకపోవటం వల్ల జూనియర్ డిస్సప్పాయింట్ అయ్యాడని అంటున్నారు. 

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాల తరువాత వస్తున్న చిత్రంగా ‘జనతా గ్యారెజ్’ మంచి క్రేజ్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తానికి‘జనతా గ్యారెజ్’ మూవీ విషయంలో టీజర్ పోస్ట్ పోన్ అనేది...అస్సలు బాగోలేదని అంటున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ టీజర్ ని రంజాన్ కానుకగా రిలీజ్ చేయనున్నారని అంటున్నారు.

ఇప్పటి వరకూ జరిగిన షూటింగ్ రిజల్ట్ పై చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. అవుట్ పుట్ అనుకున్నది అనుకున్నట్టుగా వస్తుందని ఇండస్ట్రీలోనూ టాక్స్ వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: