టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి పోటీపడుతున్న పవన్ మహేష్ ల సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లు గా మారడంతో పాటు అల్లుఅర్జున్ ‘సరైనోడు’ ఊహించని ఘన విజయం అందుకోవడంతో బన్నీ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి వాళ్లను మినహాయిస్తే మరి ఏ పరభాషా హీరోకి దక్కని ఆదరణ ఇప్పడు బన్నీకి  లేటెస్ట్ గా కేరళలో దక్కడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  

మొన్న శుక్రువారం ‘సరైనోడు’ మలయాళ వెర్షన్ ‘యోధవు’ విడుదల సందర్భంగా కేరళలో నెలకొన్న హంగామా అంతా ఇంతాకాదు. స్వయంగా అల్లు అర్జునే ఆ హంగామా చూసి ఆశ్చర్యపోయినట్లు టాక్. దీనితో కేరళలో తన సినిమా విడుదల సందర్భంగా నెలకొన్న హడావుడికి సంబంధించిన ఫొటోలు తన పేస్ బుక్ లో షేర్ చేసి ఇంత అభిమానం చూపిస్తున్న అభిమానులకు చాలా థ్యాంక్స్ అని ట్విట్ చేసాడు. 

మొన్న కేరళ వ్యాప్తంగా 80 స్క్రీన్లలో రిలీజైన ‘యోధవు’కు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. తొలిరోజు 75 లక్షల నుంచి 80 లక్షల దాకా షేర్ కలెక్ట్  అయిందని మళయాళ మీడియా వార్తలు రాస్తోంది. అంతేకాదు ఒక పరభాషా కథానాయకుడి సినిమాకు ఇది చాలా భారీ ఓపెనింగ్స్ అంటూ మీడియా కామెంట్స్ రాస్తోంది. 
కేరళలో ఈరోజుతో  ముగిసే వీకెండ్లో 2 కోట్ల దాకా షేర్ వసూలయ్యే అవకాశముంది అన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాకు  వచ్చిన పాజిటివ్ టాక్  చూస్తూ ఉంటే  కేరళలో ఈ సినిమాకు ఫుల్ రన్లో ఓ నాలుగైదు కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.

దీనితో కేరళలో సినిమాసినిమాకు బన్నీకి పెరిగిపోతున్న క్రేజ్ ను చూసి టాలీవుడ్ షాక్ అయిపోతోంది. ఈవార్తలు అన్నీ మెగా కాంపౌండ్ కు మరింత టెన్షన్ పెడతాయి అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: