తెలుగుదేశం మహానాడుకు దూరంగా ఉన్న జూనియర్ లేటెస్ట్ గా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలవబోతున్నాడు అంటూ వెబ్ మీడియాలో వార్తలు హడావిడి చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ‘మహానాడు’ కు కనీసం జూనియర్ తండ్రి హరికృష్ణ కూడ రాని నేపధ్యంలో హరికృష్ణ మహానాడులో కనపడక పోవడం పై ఇప్పటికే మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ కోసం చెన్నై వెళ్ళిన జూనియర్ తన ‘జనతా గ్యారేజ్’ యూనిట్ సభ్యులతో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసి ఆమెను అభినంధించడానికి అపాయింట్ మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ కు చెందిన జూనియర్ కనీసం తెలుగుదేశం మహానాడు వంక చూడటానికి కూడ తీరిక లేకుండా ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ కోసం చెన్నై వచ్చి అక్కడ రాజకీయ నాయకులతో భేటీలు ఏమిటి అని కొందరు కామెంట్ చేస్తున్నారు. 

తమిళనాడు ప్రజలచే అమ్మగా పిలవబడే జయలలిత ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచి రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మకు కంగ్రాట్స్ చెప్పడానికి ఎన్టీఆర్ వెలుతున్నాడని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఏ మాత్రం పట్టించుకోని జూనియర్ ఇలా తమిళనాడులో సందడి చేయడం వెనుక జూనియర్ ఆంతర్యం ఏమిటి అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో  తెలియక పోయినా ఇప్పుడు ఈ న్యూస్ హాట్ న్యూస్ గా మారింది. 

ఇది ఇలా ఉండగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నిన్న చెన్నైలో ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ స్పాట్ కు వెళ్ళి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా జూనియర్ కు శుభాకాంక్షలు తెలిపినట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: