సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన హీరోయిన్ ప్రియమణి. ప్రియమణి తన అందాలతో స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్స్ ని చేజిక్కించుకుంది. అంతే కాకుండా బ్లాక్ బస్టర్ చిత్రాలను సైతం అందుకుంది. అయితే తను మంచి ఫాంలో ఉన్నప్పుడే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలను ఒప్పుకోవటం, తరువాత కొన్ని చిత్రాలు సక్సెస్ సాధించకపోవటంతో ఈ ఎఫెక్ట్ తన కెరీర్ పై ప్రభావం చూపించింది.

ఈ బ్యూటీ తమిళ్ లో ’పరుత్తి వీరన్’ సినిమాకు 2006 లో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. అయితే ఆ తరహా స్థాయి కథలను తరువాత ప్రియమణి చేయకపోవటంతోనే ఇక్కడ సమస్య వచ్చింది. చేసిన అన్నీ కమర్షియల్ చిత్రాలు వరుసగా ప్లాపులను అందుకుంటున్న సమయంలో...ఇక తన మార్కెట్ ఘోరంగా పడిపోయింది. ఈ విషయం తనకు తెలిసినప్పటికీ....దీన్ని చక్కదిద్దుకునే ప్రయత్నాన్ని కూడ చేయలేదు.

దాదాపు 3 సంవత్సరాలుగా ప్రియమణి ఒకటి రెండు చిత్రాలతోనే సరిపెట్టకోవాల్సి వచ్చింది. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో తన పని అయిపోయిందని భావించిన బ్యూటీ, ఇప్పుడు పెళ్ళికి రెడీ అవుతుంది. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముస్తఫా రాజ్ తో బెంగుళూరులోని బనశంకరిలోని తన స్వగృహంలో ప్రియమణి నిశ్చితార్ధం చేసుకుంది.

అయితే పెళ్ళి తరువాత కూడ తన టైం బాగుంటుందని భావించిన ప్రియమణి, పెళ్ళి తరువాత తను వరుస పెట్టి మూవీల్లో నటించేందుకు రెడీ అవుతుందని అంటున్నారు. ఈ విషయాన్ని తనే స్వయంగా మీడియాకి సైతం చెప్పటంతో...ప్రియమణి ఇంకా హీరోయిన్ గా నటించాలనే కోరిక చాలా బలంగా ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: