'ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య లవర్ బోయ్ ఇమేజ్ తో వరుసెంట క్రేజీ సినిమాలే చేస్తున్నాడు. రీసెంట్ గా నందిని రెడ్డి డైరక్షన్లో వచ్చిన 'కళ్యాణ వైభోగమే' హిట్ తో మరింత జోష్ పెంచుకున్న శౌర్య.. త్వరలో 'ఒక మనసు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత హుస్సెన్ షా కిరణ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన హుస్సెన్ షా కిరణ్ నాన్నకు ప్రేమతో సినిమాకు కథ అందించడం జరిగింది. 


ఇక ఈ మద్యనే 'మీకు మీరే మాకు మేమే' సినిమాను తీసిన ఈ దర్శకుడు అది రిలీజ్ కాకుండానే మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. నాగ శౌర్య హీరోగా చేస్తున్న ఈ సినిమా టైటిల్ 'వేదాంతం' అని పెడుతున్నట్టు సమాచారం. సుకుమార్ పర్యవేక్షణలో పనిచేసిన అనుభవం ఉన్న హుస్సెన్ షా కిరణ్ సుకుమార్ ఆలోచనల్లానే తన సినిమాలను కూడా విచిత్రంగా తీర్చిదిద్దుతున్నాడు అన్నది అతని సినిమాల టైటిల్స్ చూస్తేనే అర్ధమవుతుంది. 


మరి నాగ శౌర్య చెబుతున్న ఈ వేదాంతం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం నాగశౌర్య ఒక మనసు రిలీజ్ కు రెడీ అవుతుంది ఆ సినిమా అవుట్ పుట్ ను బట్టి వేదాంతం సినిమాకు ఇంకాస్త క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కుర్ర హిరోల్లో తన జోరు కొనసాగిస్తున్న నాగశౌర్య కెరియర్ గ్రాఫ్ సినిమా సినిమాకు పెంచుకుంటూ పోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: