రాజమౌళిని అనుసరిస్తూ ఆయన కొడుకు కార్తికేయ దర్శకుడు అవుతాడని అందరూ ఎదురు చూస్తూ ఉంటే అందరికీ షాక్ ఇస్తూ కార్తికేయ తన క్లోజ్ ఫ్రెండ్తో కలిసి ‘ది సర్క్యూట్’ పేరుతో ఓ హోటల్ ని ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్లోని కొండాపూర్లో ఈ న్యూ వెంచర్ కు కార్తికేయ మొన్న శ్రీకారం చుట్టాడు.
ఈ విషయాన్ని ‘బాహుబలి’ ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ తన ట్విట్టర్ ద్వారా తెలియ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ‘ప్రాన్స్ పలావ్ రవ్వదోశ’ ఇక్కడ ట్రై చేయండంటూ అంటూ శోభు యర్ల గడ్డ ట్వీట్ చేశాడు. ఈ న్యూస్ బయటకు రావడంతో రాజమౌళి కొడుకు న్యూ బిజినెస్ మొదలుపెట్టాడని తెలిసి ఇండస్ట్రీలోని ప్రముఖులు అంత ఆ రెస్టారెంట్ వైపు లుక్కేసినట్టు సమాచారం.
‘ఈగ’ ‘బాహుబలి’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి కృషి వెనక రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ కష్టం కూడా ఉంది అన్నది ఓపెన్ సీక్రెట్. సహాయ దర్శకుడి పని మొదలుకొని లైట్ బాయ్ పని వరకు కార్తికేయని ఎలా కావలసి వస్తే అలాపని చేయించాడు రాజమౌళి.
తండ్రితో పాటు ఇలా కష్టపడి పనిచేస్తున్నాడు కాబట్టి కార్తికేయ కూడా భవిష్యత్తులో దర్శకుడు అవుతాడు అంటూ టాలీవుడ్ లో ప్రచారం జరిగింది. ఈ మధ్య ఒక ప్రముఖ కథానాయకుడితో కార్తికేయ సినిమా తీయబోతున్నాడని కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఊహా గానాల మధ్య కార్తికేయ హోటల్ బిజినెస్ వార్తలు వెలుగులోకి రావడం ఊహించని ట్విస్ట్.
అయితే ఈ వార్తలు ఇలా ఉండగా ఈ హోటల్ రాజమౌళి కొడుకుదా ? లేక క్లోజ్ ఫ్రెండ్దా ? ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నాడా అన్నసందేహాలని ఫిలింనగర్ లో కొందరు వ్యక్త పరుస్తున్నారు. సోషల్ మీడియాని యూజ్ చేయడంలో తండ్రిని మించిపోయిన కార్తికేయ కేవలం ఈరెస్టారంట్ ను ప్రమోట్ మాత్రమే చేస్తున్నాడు అంటూ మరి కొందరు అంటున్నారు. ఏమైనా తెలివి తేటల విషయంలో కార్తికేయ తన తండ్రిని మించిపోయినట్లే కనిపిస్తోంది..