క్రియేటివ్ దర్శకుడిగా పేరుగాంచిన శ్రీకాంత్ అడ్డాల తాను తీసిన కేవలం రెండే రెండు  సినిమాలతో  కుటుంబ సినిమాలకు చిరునామాగా మారిపోవడమే కాకుండా టాలీవుడ్ టాప్ దర్శకుల లిస్టులోకి చేరిపోయాడు. అయితే  ఇతడికి వచ్చిన పేరు ఖ్యాతి అంతా ఒకే ఒక్క సినిమా ‘బ్రహ్మోత్సవం’ తో ఆవిరి అయిపోయింది. 

సామాన్యంగా ఎంతటి టాప్ డైరెక్టర్ కు అయినా విజయాలు పరాజయాలు సర్వసాధారణ మే అయినా  ‘బ్రహ్మోత్సవం’ విషయంలో శ్రీకాంత్ అడ్డాల టార్గెట్ అయిన విధంగా ఈ మధ్య ఏ డైరెక్టర్ టార్గెట్ కాబడలేదు. ఈ సినిమా మూల కథ బాగున్నా చెప్పే విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమాఘోరమైన డిజష్టర్ గా మారిపోయింది.  
ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాలను ఏమీ అనొద్దు ఈ కథ ఎంపిక ఇతర విషయాలలో తాను కూడ చాలా తప్పులే చేశాను అంటూ మహేష్ తన అభిమానులకు మెసేజ్ లు పoపిన విషయం తెలిసిందే. ఈ విషయానికి కొనసాగిపుగా శ్రీకాంత్ అడ్డాల  మహేష్ అభిమానులకు సారీ చెబుదాం అని డిసైడ్ అయ్యాడట. అయితే అంతకంటే ముందే మహేష్ బాబను కలసిన తరువాత మాత్రమే మహేష్ అభిమానులకు  సారీ చెప్పాలని శ్రీకాంత్ అడ్డాల భావిస్తున్నట్లు టాక్.

మహేష్  లండన్ వెళ్ళక ముందు కలవాలని శ్రీకాంత్ అడ్డాల ప్రయత్నించలేదు అనే వార్తలు కూడ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ షాక్ నుండి తేరుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అసలు ‘బ్రహ్మోత్సవం’ ఎందుకు ఫెయిల్ అయింది అనే విషయమై ఒక సమగ్ర నివేదికలా తయారు చేసి మహేష్ కు ఇచ్చి జరిగిన పొరపాట్లు పై క్లారిటీ ఇవ్వడానికి శ్రీకాంత్ ప్రయత్నిస్తున్నాడు అని టాక్. అంతేకాదు మహేష్ కోసం తాను తయారుచేసిన మరో కథను వినిపించడానికి కూడ శ్రీకాంత్ డిసైడ్ అయ్యాడు అని అంటున్నాడు. శ్రీకాంత్ అడ్డాల క్షమార్పణలతో మహేష్ అభిమానుల కోపం చల్లారుతుందని భావించాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: