తెలుగు ఇండస్ట్రీలో చారిత్రాత్మక చిత్రాలకు ఎంతో ఆదరణ ఉంది. అప్పట్లో ఎక్కువ జానపద, పౌరాణిక చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు..ఇక ఆ సినిమాలు కూడా అద్భుత విజయాలు సాధించాయి. ఈ మద్య కాలంలో కూడా జానపద చిత్రాలు, ఫాంటసీ చిత్రాలు బాగా తీస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అబ్బాయి రాంచరణ్ ‘మగధీర’ అద్భుత విజయం సాధించింది. ఇక బాహుబలి,రుద్రమదేవి లాంటి చిత్రాలు కూడా కనీ వీనీ ఎరుగని రీతిలో విజయాలు సాధించాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించ బోతున్నారు.

ఈ చిత్రానికి కంచె ఫేమ్ క్రిష్ దర్శకత్వం వహించబోతున్నారు. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లోగో అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు.  ఈ సినిమాలో యువరాణిగా కాజల్ అగర్వాల్ నటించనుందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే తాజాగా బాలయ్యకు జంటకు శ్రియా నటించనుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్.ఇప్పటికే ''గౌతమిపుత్ర శాతకర్ణి'' తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. మొరాకోలో జరిగిన మొదటి షెడ్యూల్‌లో పలు యుద్ద సన్నివేశాలను తెరకెక్కించారు. రెండో షెడ్యూల్ హైదరాబాదులో ప్రారంభం కానుంది. ఇక  ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయిన నేపథ్యంలో బాలయ్య సరసన నటించబోయే హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.

ఆ మద్య బాలయ్య పక్కన అనుష్క అనుకున్నారు..కానీ ఆమె ప్లేస్ లో ఇప్పుడు  శ్రియను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అనుష్క చిరంజీవి 150వ సినిమాలో ఛాన్సు దక్కించుకోవడంతో పాటు బాహుబలి సినిమా షూటింగ్‌లో అమ్మడు బిజీబిజీగా ఉండటంతో శ్రియాను బాలకృష్ణ అండ్ క్రిష్ టీమ్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: