పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు అతడి వీరాభిమానులే కాదు సాధారణ ప్రజలు కూడ పవన్ వంక చూడకుండా ఉండలేరు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హడావిడిగా తన ఫ్లైట్ కోసం వడివడిగా అడుగులు వేస్తున్నప్పుడు కొందరు పవన్ కళ్యాణ్ ను తన సెల్ కెమెరాలతో ఫోటోలు తీసారు. ఈ సందర్భంలో తీసిన ఫోటోలు కొందరు వెబ్ మీడియాకు లీక్ చేసారు. 

ఈమధ్య కాలంలో టాప్ హీరోలు భాగ్యనగరంలో ఉంటున్నారో లేక విదేశాలలో ఉంటున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆ మధ్య అల్లుఅర్జున్ కాశ్మీర్ వెళుతున్నాడు అంటూ వార్తలు వచ్చిన తరువాత హఠాత్ గా సింహాచలంలో కనిపించి లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు. మహేష్ ‘బ్రహ్మోత్సవం’ విడుదలకు ముందే లండన్ వెళ్ళిపోతున్నాడు అని వార్తలు వచ్చాక ‘బ్రహ్మోత్సవం’ సూపర్ ఫెయిల్యూర్ ను పూర్తిగా తెలుసుకుని ఆ తరువాత లండన్ వెళ్ళాడు. 

అదేవిధంగా పవన్ కళ్యాణ్ తన అత్తవారింటిలో రష్యాలో ఉన్నాడని వార్తలు వస్తూ ఉంటే ఇలా రాత్రి ఎయిర్ పోర్ట్ లో కనిపించి కలకలం సృష్టించాడు. ఈమధ్య పవన్ 10 రోజులపాటు పూణెలో ఉండి ఆ తరువాత రష్యా వెళ్ళాడని అందరూ అనుకుంటూ ఉంటే ఇలా పవన్ ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో పవర్ స్టార్ రష్యా నుంచి వస్తున్నాడా లేక వెళుతున్నాడా  అంటూ కొందరు సెటైర్లు వేసుకున్నట్లు టాక్. 

ఈ వార్తలు ఇలా ఉండగా పవన్  పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌస్ లోని మామిడి తోటలో పండిన మామిడి పండ్లను తనకు ఇష్టమైన వాళ్లకు పంపిన ఫోటోలు కూడ వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. హీరో నితిన్ తన అభిమాన హీరో పంపిన  మామిడి పండ్ల బుట్టను చూసి జోష్ లోకి వెళ్లిపోయి ‘థ్యాంక్యూ సర్’ అంటూ ఆ బుట్ట ఫోటోను తన  ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ఏది ఏమైనా పవన్ ఇక్కడ ఉన్న లేకపోయినా అయన తోటలోని మామిడి పండ్లు మాత్రం భాగ్యనగరంలో హడావిడి చేస్తూనే ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: