జనతా గ్యారేజ్ బడ్జెట్ మించిపోతుందా.. అనుకున్న దాని కన్నా ఎక్కువ పెట్టల్సి వస్తుందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్హీరోగా నటిస్తున్న జనతా గ్యారేజ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం జరిగింది. అయితే సినిమా బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండే కొరటాల శివ బడ్జెట్ కంట్రోల్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నాడట.  


ఇప్పటికి 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమా అనుకున్న బడ్జెట్ కు రీచ్ అయ్యిందట. అయితే ఇంకా 30 శాతం షూటింగ్ సాంగ్స్, ప్రమోషన్స్ ఇవన్ని కలిస్తే నిర్మాతలకు మరింత భారం అయ్యే అవకాశం కనిపిస్తుంది. తారక్ నటించిన నాన్నకు ప్రేమతో కూడా అంతే సినిమా హిట్ అని చెప్పుకుంటున్నా నిర్మాత బోగవల్లి ప్రసాద్ కు అంత లాభాలేం రాలేదట.


జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ :


మరి తెలిసి మళ్లీ ఎందుకు నిర్మాణ విలువ్లను పెంచుతున్నారో మరి.. అయితే సినిమా బడ్జెట్ కన్నా సినిమాకు పనిచేసే వారి రెమ్యునరేషన్ సినిమాకు పెద్ద తలనొప్పిగా మారిందట. ఇప్పటికే మోహన్ లాల్ భారీగానే డిమాండ్ చేశాడట. ఇక మరాఠి నటుడు సచిన్ కు కూడా భారీ మొత్తంగానే ఇస్తున్నారట. 


అయితే ఈ విషయాన్ని ముందే గమంచిన ఎన్టీఆర్ కొరటాల శివకు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉన్నాడట. తారక్ కెరియర్ లో మోస్ట్ స్టైలిష్ మూవీగా జనతా గ్యారేజ్ రూపొందించబడుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి గ్యారేజ్ ఖర్చులు కాస్త తగ్గించుకుంటే నిర్మాత సేఫ్ అవుతాడు లేదంటే ఈయన పెట్టాడు కదా అని సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేప్పుడు రేటు పెంచితే అప్పుడు ఇద్దరికి లాస్ వచ్చే అవకాశం ఉంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: