తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యన్ ఎంట్రీ ఇచ్చిన కొత్తలో పెద్దగా విజయవంతమైన చిత్రాలేవీ రాలేదు..ఆ సమయంలో ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ చిత్రం ‘ఖుషి’ చిత్రంతో పవన్ స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి నుంచి పవన్ సినిమాలు ఒక్కొక్కటీ సూపర్ హిట్ కావడం జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలతో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు పవన్ కళ్యాన్. ఒక్క నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందాడు. ఇక అత్తారింటికి దారేది చిత్రం తర్వాత రెండు సంత్సరాల గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాన్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఉగాది రోజున విడుదలైంది. కానీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో ఫ్యాన్స్‌ని నిరాశపరిచిన పవన్.. ఈసారి ఎలాగైనా వారికి హిట్ ఇవ్వాలనే భావనతో అప్పుడే తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు.  గతంలో తన కెరీర్ మలుపు తిప్పిన దర్శకుడి ఎస్.జె.సూర్య దర్శకత్వంలో కొత్త సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 27వ తేదీన లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో పవన్ ఓ ఫ్యాక్షన్ లీడర్ కాగా.. రాజకీయాల్లో జరుగుతున్న అక్రమాలను ఓవైపు ఎండగడుతూనే.. మరోవైపు అతని లవ్ స్టోరీ కొనసాగుతుందట.


హీరోయిన్ కూడా అతనికి సపోర్ట్ చేస్తుందని.. ఈ విషయం తెలుసుకున్న విలన్లు ఆమెను కిడ్నాప్ చేసి పవన్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తారని.. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ అంటూ ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది. ఈ మద్య సినిమాలకు సంబంధించి స్టోరీలు ముందే లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి ఈ చిత్రంలో పవన్  ఒక ఫ్యాక్షన్ లీడర్‌గా సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: