తెలుగు ఇండస్ట్రీలో నందమూరి హీరోల హవా కొనసాగుతుంది..ఇక నందమూరి బాలకృష్ణ తన 100 వ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా దేవి శ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్..గత సంవత్సరం టెంపర్ చిత్రంతో జోరు పెంచిన మనోడు ఈ సంవత్సరం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. తాజగా కొరటాల శివ దర్శకత్వం ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నటిస్తున్నాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ పెరిగిపోయింది.  గతంలో ఇక్కడ ఫ్లాప్ అయిన కొన్ని చిత్రాలు హిందీలో డబ్ అవ్వగా.. అక్కడ రికార్డ్ స్థాయిలో టీఆర్‌పిని తెచ్చుకున్నాయి. తెలుగులో డిజాస్టర్‌గా మిగిలిపోయిన చిత్రం దమ్ము అక్కడ  90 లక్షలకుపైగా వ్యూస్ రాబట్టుకుంది. అంతేకాదు.. ‘రభస’ హిందీలో లిమిటెడ్ స్ర్కీన్స్‌లో డబ్బింగ్ వెర్షన్‌లో విడుదలై మంచి కలెక్షన్స్ వసూలు చేస్తే.. ‘నాన్నకుప్రేమతో’ డైరెక్ట్ తెలుగు వెర్షన్‌లోనే విడుదలై మంచి వసూళ్ళు రాబట్టింది.  దీంతో ఇప్పుడు అందరి చూపు జనతా గ్యారేజ్ పైనే ఉంది.

            బడ్జెట్ మించుతున్న 'జనతా గ్యారేజ్'..!
తాజాగా  ‘జనతా గ్యారేజ్’ శాటిలైట్ రైట్స్‌ని స్టార్ గ్రూప్ సంస్థ భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ సంస్థ ఏకంగా ఈ చిత్రానికి రూ.6.50 కోట్లు చెల్లించి ఈ మూవీ శాటిలైట్ రైట్స్‌ని సొంతం చేసుకుందని సమాచారం. అయితే గతంలో పవన్ కళ్యాన్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’, అల్లు అర్జున్ ‘సరైనోడు’ చిత్రాలకు శాటిలైట్ హక్కులు రూ.6 కోట్ల ధర పలికాయి. ఇప్పుడు వాటి రికార్డ్స్‌ని గ్యారేజ్ బద్దలు కొట్టింది. అంతేకాదు ‘బాహుబలి’ తర్వాత అత్యధిక రేటుకు శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన సినిమాగా ‘జనతా గ్యారేజ్’ రెండో స్థానంలో నిలిచింది.



మరింత సమాచారం తెలుసుకోండి: