తెలుగు లో జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘యమదొంగ’ చిత్రంలో అమాయకంగా కనిపించిని మళియాలి బ్యూటీ ప్రియమణి తర్వాత చిత్రాల్లో విపరీతంగా అందాలు ఆరబోసింది. తెలుగు, తమిళ, మళియాలి భాషల్లో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ గత కొంత కాలంగా పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలు లేదు..ఆ మద్య బాలీవుడ్ లో కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ సరసన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో కనిపించింది. తాజాగా ఈ అమ్మడు ప్రేమించిన ప్రియుడిని వివాహం చేసుకోబొతుంది. అయితే ఈ సందర్భంగా ప్రియమణి  ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి ఆశిర్వదించమని కోరింది.

తమ అభిమాన హీరోయిన్ వివాహం చేసుకోబొతుందని ఆనందంతో చాలా మంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ సోషల్ మీడియా అంటేనే మంచి ఎంత ఉంటుందో చెడు అంతకు మించి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక ప్రియమణి చేసుకోబొయే వ్యక్తి ముస్లిం కాండంతో కొంతమంది ఆకతాయిలు వారి ప్రేమను లవ్-జీహాద్ పేరుతో కామెంట్స్ పెట్టారట. దీంతో ఈ అమ్మడికి ఎక్కడో కాలింది.

తానెంతో గౌరంగా అభిమానంగా తన న ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి ఆశిర్వదించమని కోరితే ఇలాంటి పిచ్చి కామెంట్స్ పెట్టి హర్ట్ చేస్తారా అంటూ అలాంటి పిచ్చి కామెంట్లు చేయకండి. మీ కామెంట్లతో చిరాకు వస్తోంది. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోన్నాని, వీలైతే ఆశీర్వదించండి కానీ మనసుకు ఇబ్బంది పెట్టే కామెంట్లు రాయకండని కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: