ఈ మద్య సినిమా ఇండస్ట్రీలోకి సంబంధించిన ప్రముఖులు వరుసగా మరణిస్తున్నారు. రీసెంట్ గా సింధూర పువ్వా దర్శకులు మరణించిన విషయం తెలిసిందే..తాజాగా ప్రముఖ నిర్మాత, వాణిజ్య విశ్లేషకులు వికాస్ మోహన్ కన్ను మూశారు.గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన  సిటీ కేర్ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు వెల్లడించారు.


బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో వికాస్ మోహన్


అక్షయ్ కుమార్, మాధురీ దీక్షిత్ జంటగా నటించిన ఆర్జూ(1999) సినిమాను ఆయన నిర్మించారు. తర్వాత  లిబాస్(1988) చిత్రానికీ నిర్మాతగా వ్యవహరించారు. కేవలం నిర్మతగానే కాకుండా కొన్ని చిత్రాల్లో స్వయంగా నటించారు వికాస్.  

వికాస్ మోహన్ మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, రిషికపూర్, జెనీలియా, అనుపమ్‌ఖేర్, అభిషేక్ బచ్చన్ తదితరులు సంతాపం ప్రకటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: