ప్రముఖ బాలీవుడ్ నటుడు  సురేష్ చత్వాల్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు యమన్ చత్వాల్ తెలిపారు. సురేష్ చత్వాల్ బాలీవుడ్ లోకి 1969 లో రాఖీ రాఖీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఎన్నో ప్రధానమైన పాత్రల్లో నటించారు.

షారూఖ్, సల్మాన్ నటించిన కరణ్ అర్జున్, సంజయ్ దత్ నటించిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈయన ముఖ్యపాత్రలో నటించారు. అంతే కాదు ఆ చిత్రాలతో బాగా పాపులర్ కావడంతో ఎఫ్‌ఐఆర్ అనే టివి సీరియల్‌లో కీలక పాత్రలో నటించారు.

కాగా చత్వాల్ చివరిసారిగా నటించిన మూవీ నక్షత్ర 2010లో వచ్చింది. ఈయన మృతి పట్ల బాలీవుడ్ ఇండస్ట్రీ టెలివిజన్ ఇండస్ట్రీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: