ఎట్టకేలకు మెగా అభిమానులు కలలు కంటున్నరోజు  కౌంట్ డౌన్ మొదలు అయింది. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం చిరంజీవి 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ షూటింగ్ ప్రారంభానికి చిరంజీవి జాతక రీత్యా జ్యోతిష్కులు జూన్ 23న ముహూర్తం నిర్ణయించడంతో చిరంజీవి  పై ఆరోజు ఉదయం ఈ సినిమాకు సంబంధించి మొట్టమొదటి షాట్ తీయబోతున్నారు. ఏప్రియల్ నెలలో రామ్ చరణ్ ఆఫీసులో లాంఛనంగా ప్రారంభం అయిన ఈసినిమా షూటింగ్ ఎట్టకేలకు రకరకాల ట్విస్టులు తరువాత తిరిగి పట్టాలు ఎక్కబోతోంది. 

వి.వి. వినాయక్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ వచ్చిన 13 సంవత్సరాల గ్యాప్ తరువాత అదే క్రేజీ కాంబినేషన్ లో చిరంజీవి మళ్ళీ ఒక తమిళ రీమేక్ ను నమ్ముకుని తన 150వ సినిమాకు సాహసం చేస్తున్నాడు. ఈసినిమాలో నటించే నటీనటులు అందరూ ఎంపిక అయినా ఈ సినిమా హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. 

వెన్నెల కిషోర్, కేథరిన్ లతో పాటు మరికొంతమంది నటీనటుల ఎంపిక పూర్తి అయిపోయినా హీరోయిన్ విషయం పై దీపిక పదుకొనే తో ఇంకా సంప్రదింపులు జరుపుతున్న నేపధ్యంలో ఈ సినిమా నటీనటుల ఎంపికకు సంబంధించిన విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించడం లేదు అనే వార్తలు ఉన్నాయి. రామ్ చరణ్ తో పాటు ఇంకా ఎంతమంది మెగా యంగ్ హీరోలు ఈసినిమాలో అతిథి పాత్రలలో కనిపిస్తారు అనే విషయం పై కూడ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 

ఆశ్చర్యకరంగా ఈసినిమాకు ముగ్గురు స్టార్ రైటర్స్ పనిచేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. పరుచూరి బ్రదర్స్ ఈసినిమాకు సంబంధించిన పొలిటికల్ పంచ్ డైలాగ్స్ ను వ్రాస్తే, రచయిత సాయి మాధవ్ బుర్ర ఈసినిమాలోని సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్ కు సంబంధించిన డైలాగ్స్ వ్రాసినట్లు టాక్. వీరితో పాటుగా రచయిత ఆకుల శివ ఈ సినిమాకు సంబంధించి కామెడీ ట్రాక్ ను కామెడీ డైలాగ్స్ ను వ్రాసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ముగ్గురు రచయితలు ఎంతో ఆలోచన చేసి ‘కత్తి’ సినిమాకు అనేకమైన మార్పులు చేర్పులు చేసి ‘కత్తిలాంటోడు’ గా మార్చిన నేపధ్యంలో జ్యోతిష్కులు నిశ్చయించిన ఈ 23వ తారీఖు ముహూర్తం చిరంజీవికి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: