మెగా డాటర్ గా పేరు గాంచిన నిహారిక మెగా ప్రిన్సెస్ గా మారడానికి ప్రయత్నిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఒక మనసు’ మరో 48గంటలలో విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈసినిమా రిజల్ట్ గురించి అందరు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓరేంజ్ లో ఉన్నా సామాన్య ప్రేక్షకులను నిహారిక ఎంత వరకు ధియేటర్ల వద్దకు రప్పించ గలుగు తుంది అన్న విషయమై రకరకాల అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. 

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తోలి హీరోయిన్ కావడంతో ఈమె పట్లమెగా అభిమానులు కూడ ఎలా స్పందిస్తారు అన్న ఆతృత కూడ ఉంది. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమాకి సంబందించిన ఒక వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. ఈ కధను తీసుకుని దర్శకుడు రామరాజు మొదట స్టార్ హీరోయిన్ సమంతకు వినిపిస్తే  ఆమె తనకు కథ నచ్చినా డేట్స్ ఖాళీ లేవు అంటూ తప్పుకున్నట్లు టాక్. 

ఆ తర్వాత రామరాజు ఈకథను తీసుకొని మెగా హీరోయిన్ రెజీనాను సంప్రదిస్తే  ఈమె కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా నెలకు ఐదారు రోజుల చొప్పున మాత్రమే డేట్స్ ఇవ్వగలనని దర్శకుడు రామరాజ్ కు చుక్కలు చూపించినట్లు టాక్. దాంతో చేసేది లేక నిర్మాత మధుర శ్రీధర్ ఇచ్చిన సలహాతో  రామరాజ్ నిహారికను తెరపైకి తీసుకు వచ్చాడని తెలుస్తోంది.  

ఈ కథ విని ఇంప్రెస్ అయిన నిహారిక ఆమె తండ్రి నాగబాబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా అనుకున్న విధంగా పూర్తి అయి విడుదలకు రెడీ అయింది అని టాక్. దీనితో అంచనాలకు అనుగుణంగా ‘ఒక మనసు’ సూపర్ హిట్ అవుతుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో సమంత రెజీనాలు ఒక మంచి సినిమాను వదులు కున్నందుకు బాధ పడుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా రేపు తాత్రి ‘ఒక మనసు’ స్పెషల్ షో ను మెగా ఫ్యామిలీ మెంబెర్స్ కోసం ప్రత్యేకంగా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోకు చిరంజీవితో సహా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరవుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: