జూనియర్ బాలకృష్ణల మధ్య దూరం రోజురోజుకు పెరిగి పోతున్న నేపధ్యంలో జూనియర్ నందమూరి అభిమానుల పై తన పట్టును పెంచు కోవడానికి ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో ఈమధ్య తరుచూ తన అభిమానులను కలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈమధ్య తన ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ స్పాట్ లో తనను కలవడానికి వచ్చిన అభిమానులతో జూనియర్ చేసిన కామెంట్స్ వెనుక అర్ధాలు ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం జూనియర్ ఈమధ్య ఖమ్మం నుంచి తనను కలవడానికి వచ్చిన కొంత మంది అభిమానులతో ‘మనమంతా నందమూరి ఫ్యాన్స్’ అంటూ కామెంట్ చేసినట్లు టాక్. అంతేకాదు నందమూరి ఫ్యాన్స్ లో వర్గాలు లేవనే కామెంట్స్ కూడ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి గతంలో ఖమ్మం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు గా పనిచేసి టి.ఆర్.ఎస్. లో కొనసాగుతున్న ఒక యువజన నాయకుడుతో వచ్చిన అభిమానులతో జూనియర్ ఈ కామెంట్ చేసినట్లు టాక్. 

అయితే ఈ కామెంట్స్ బాలయ్య దృష్టి వరకు వెళ్ళడంతో జూనియర్ అభిమానుల మధ్య చొచ్చుకుపోతున్న విషయాన్ని బాలకృష్ణ చాల నిశితంగా పరిశీలిస్తున్నట్లు టాక్. దీనికితోడు జూనియర్ తన ‘జనతా గ్యారేజ్’ ఆడియో ఫంక్షన్ ను ఖమ్మం పట్టణంలో నిర్వహించడానికి ఆలోచనలు చేయడం వెనుక కూడ ఒక ఎత్తుగడ ఉంది అని అంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో బాలకృష్ణ కంటే జూనియర్ కు ఎక్కువ క్రేజ్ ఉంది అన్న విషయం ఓపెన్ సీక్రెట్.

ఈ విషయాన్ని పసి గట్టన జూనియర్ తన ఫ్యాన్ బేస్ ను తెలంగాణ ప్రాంతంలో మరింత పెంచుకోవడానికి ఈ ‘జనతా గ్యారేజ్’ ఆడియో ఫంక్షన్ ఎత్తుగడ వేసాడు అనే కామెంట్స్ కూడ ఉన్నాయి. కోస్తా జిల్లాలలో తెలుగుదేశం అధికారంలో ఉండటంతో బాలయ్య పరపతి ముందు తన ఇమేజ్ సరిపోదు అన్న ఉద్దేశంతో జూనియర్ తన ‘జనతా గ్యారేజ్’ ఫంక్షన్ ఖమ్మంలో నిర్వహించి బాలయ్యకి షాక్ ఇచ్చే ఎత్తుగడలో జూనియర్ ఉన్నాడు అనే గాసిప్పుల హడావిడి మొదలైంది. ఈ విషయాలు అన్నీ బాలకృష్ణ చాల లోతుగా తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: