బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ఇంకా బ్యాడ్ లక్ నడుస్తూనే ఉంది.. ఓ పక్క చేస్తున్న సినిమాలేమో నిరాశ పరుస్తుండగా మరో పక్క ఆఫర్లు కూడా గగనమయ్యాయి. అనురాగ్ బసు దర్శకత్వంలో రణబీర్ తో చేస్తున్న జగ్గూజాసూస్ రెండేళ్లుగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. మధ్యలో ఇద్దరు ప్రేమలో మునగటం తేలడం కూడా అయ్యింది. ఇక కొద్దిరోజుల నుండి రణబీర్ తో సరైన సన్నిహిత్యం లేని కత్రినా అతని పేరు చెబితేనే కస్సుమంటుంది. ఇక మీడియా కావాలని పదే పదే రణబీర్ గురించి అడిగితే తనతో ఇక లైఫ్ లో అతనితో మరో సినిమా చేసేది లేదంటూ తెగేసి చెప్పింది.


అసలే అవకాశాలు లేని ఈ టైంలో తనకు రణబీర్ తలనొప్పిగా మారాడని కత్రినా అభిప్రాయపడుతుంది. మరి ఒకప్పటి ప్రేమికులు ఇప్పుడు ఎడమొహం పెడమొహం అవడానికి కారకులెవరో తెలియాలి. ప్రస్తుతం కత్రినా జగ్గూజాసూస్ మీదే అన్ని ఆశలు పెట్టుకుంది. అరకొర అవాకాశాలొస్తున్న ఈ టైంలో అమ్మడు గ్లామర్ షోకి ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. కత్రినా కైఫ్ కష్టాలెప్పుడు తీరుతాయో చూడాలి.   


ఇక మరో పక్క కత్రినా ఓ ఫారినర్ తో లవ్ లో పడ్డదని బీ టౌన్ మీడియా హడావిడి చేస్తుంది.. ఓ పక్క తన సినిమాలు ఆశించినంత సక్సెస్ అవ్వక పోగా మరో పక్క రోజుకో రూమర్ కత్రినాకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. అందుకే కొద్దిరోజులు ఒంటరిగా ఉండాలనే ఆలోచనలో ఉంది ఈ అమ్మడు. మొన్నటిదాకా బాలీవుడ్లో తన ఒంపుసొంపులతో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసిన కత్రినా ఇప్పుడు ఆ జోష్ అంతా కనుమరుగయ్యిందని అనాలి.


రానున్న రోజుల్లో అయినా కత్రినా ఫేట్ ఏమన్నా మారుతుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం కెరియర్ పెద్ద రిస్క్ లో ఉన్న సందర్బంగా ఎలాంటి ఆఫర్ వచ్చినా వెనుకాడకుండా చేసేందుకు సిద్ధమైంది ఈ అమ్మడు. అందుకే కుర్ర హీరోలతో కూడా రొమాన్స్ కు ఏమాత్రం అడ్డు చెప్పట్లేదు. పాపం కత్రినా కష్టాలు ఎప్పుడు తీరుతాయో మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: