హీరోయిన్ల పరిస్థితి అంతే. వాళ్లకు అభిమానులు ఎక్కువ. అందులోనూ అబ్బాయిలు ఎక్కువ. వాళ్లలోనూ తుంటరివాళ్లూ కొంటెవాళ్లే ఎక్కువ. వాళ్లలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కామెంట్లు పెట్టేవాళ్లు తక్కవే. కానీ, హీరోయిన్ల మీద కొంటె కామెంట్లు పెట్టేవాళ్లు మాత్రం ఎక్కువే. అదే ఇప్పుడు శ్రియకు తలనొప్పిగా మారింది. దీంతో, నిన్నటివరకూ ట్విట్టర్ లో తన మనోభావాలనూ కొత్త సినిమాల విశేషాలనూ పంచుకునే శ్రియ షడన్ గా ట్విట్టర్ కి బాయ్ చెప్పేసింది. అందుకు కారణం... కొందరు తుంటర్లు పెట్టిన అసభ్యకరమైన కామెంట్లేనట. ‘వాటిని చదవడానికి కూడా చిరాకేసింది. ఇకమీదట ట్విట్టర్ లో కనిపించాలంటే సిగ్గేస్తోంది. వాళ్లు రాసింది చదవడానికి కూడా సిగ్గేస్తోంది. అందుకే, ఇక ట్విట్టర్ కి సెలవు’ అని ట్వీట్ చేసింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను దుర్వినియోగం చేసేవాళ్లకు చెక్ పెట్టకపోతే ఇంకా శ్రియలా చాలామంది బాధపడాల్సి వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: