రాజకీయ నాయకులు సినిమా సెలెబ్రెటీలు తాము ఇచ్చిన మాట ఎప్పుడూ నిలబెట్టు కోలేరు. దీనితో వీరి మాటల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే సినిమా రంగంలో వివాదాలకు దూరంగా ఉండటమే కాకుండా పద్ధతిగా వ్యవహరించే కీరవాణి పై అందరిలో చాల గుర్తింపు ఉంది. అయితే కీరవాణి కూడ తన మాట తప్పాడు. 

2016 తరువాత ఇక తాను సినిమాలు చేయను అని కీరవాణి గతంలో బహిరంగంగా ప్రకటించిన నేపధ్యంలో ‘బాహుబలి 2’ తరువాత కీరవాణి సంగీతం వినిపించదేమో అని భయ పడ్డారు చాల మంది. ఆ మధ్య రాజమౌళి హైదరాబాద్ లో సంగీత దర్శకుడు రెహమాన్ ను కలిసి కొంత సమయం వ్యక్తిగతంగా మాట్లాడటంతో భవిష్యత్ లో కీరవాణి రిటైర్మెంట్ తరువాత రాజమౌళి సినిమాలకు రెహమాన్ ఆస్థాన సంగీత దర్శకుడుగా మారబోతున్నాడు అంటూ ఊహాగానాలు కూడ వినిపించాయి. 

అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ కీరవాణి తన రిటైర్మెంట్ ప్లాన్ ను మార్చుకున్నాడు. నాగార్జున రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందబోతున్న ‘ఓం నమోవెంకటేసాయా’ సినిమాకు కీరవాణిని సంగీత దర్శకుడుగా ప్రకటించారు. ఈసినిమా షూటింగ్ రేపు ప్రారంభం కాబోతోంది. ‘అన్నమయ్యా’ ‘రామదాసు’ సినిమాల స్థాయిలో కీరవాణి ఈసినిమాకు అద్భుతమైన ట్యూన్స్ ఇవ్వడానికి అప్పుడే తన పనిని మొదలు పెట్టినట్లు టాక్.

కొద్ది రోజుల క్రితం నాగార్జున రాఘవేంద్రరావుతో కలిసి తిరుపతి వెళ్ళి ఈసినిమా స్క్రిప్ట్ కు పూజలు చేయించడమే కాకుండా ఇప్పటికే ఈ సినిమా లుక్ కు సంబంధించిన తన గుబురు గడ్డంతో రెడీ అయిపోయాడు నాగార్జున. ఒకవైపు ‘సోగ్గాడే చిన్నినాయన’ అంటూ ఇద్దరి హీరోయిన్స్ తో రొమాన్స్ చేసి ఇప్పుడు మళ్ళీ రూట్ మార్చి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు గా  హాథీరామ్ బాబాగా మారే సాహసం ఒక్క నాగార్జున మాత్రమే చేయగలడు..
 



మరింత సమాచారం తెలుసుకోండి: