భారత దేశంలో నరేంద్రమోడి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగా డే’ సందర్భంగా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. వివిధ రాష్ట్రాలో రాజకీయ నాయకులు, సెలబ్రెటీస్ యోగా డే రోజు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తాజాగా యోగా కేవలం ఆరోగ్యమే కాదు కాసుల వర్షం కూడా కురిపిస్తుందని బాలీవుడ్ నటి బిపాసా బసు నిరూపించింది. అసలు విషయానికి వస్తే.. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెంగుళూరులో నిర్వహించిన శిబిరంలో గంటన్నర పాటు యోగాలో పాల్గొన్న బాలీవుడ్ నటి బిపాసా బసుకు సిద్ధ రామయ్య ప్రభుత్వం కోటిన్నర రూపాయలు చెల్లించింది.

మరో వైపు దీనిపై అన్ని వైపుల నుంచి విమర్షలు వస్తున్నాయట. అంతే కాదు ముంబై నుంచి ఆమె బెంగుళూరుకు రాకపోకలు, బెంగుళూరులో ఆమె బస కోసం మరి కొంత సొమ్ము కూడా ఖర్చు చేశారట. అయితే యోగా డే రోజు చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారని అంతమాత్రాని ఇలాంటి సందర్భం ఎక్కడా చూడలేదని  భారతీయ సంస్కృతికి అద్దంపట్టే యోగాకు బిపాసాను పిలవడమేమిటని శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ ప్రశ్నించారు.

ఇంకా నయం ఇలాంటి వాటికి జనాలను ఆకర్షించడానికి సన్నిలీయోన్ తో స్పెషల్ యోగా చేయించడాని రప్పించాల్సి ఉంది అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. మొత్తనికి ఈ బ్లాక్ బ్యూటీకి మాత్రం యోగా డే సందర్భంగా కోటిన్నర పట్టేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: