మెగాహీరో రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ధృవ. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకోనుంది. ఇప్పటికే ధృవ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. గోవిందుడు అందరివాడే, బ్రూస్ లీ వంటి పరాజయాల తరువాత రామ్ చరణ్ ప్రిస్టేజియస్ గా తీసుకున్న చిత్రం ధృవ.


ఈ మూవీతో ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ ని కొట్టాలని రామ్ చరణ్ చూస్తున్నాడు. ‘సురేందర్ రెడ్డి’సైతం ఈ మూవీని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఖర్చుకి ఏ మాత్రం వెనకాడకుండా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సినిమా కచ్ఛితంగా సక్సెస్ ని సాధిస్తుందని చిత్ర యూనిట్ బలమైన నమ్మకంతో ఉంది.


ఇదిలా ఉంటే ‘రామ్ చరణ్’ తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన పనులని ఇప్పటికే స్టార్ట్ చేశారు. ధృవ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తయిన వెంటనే, రామ్ చరణ్.. ‘సుకుమార్’ తో చేయనున్నాడు. ఇక ఈ మూవీ అక్టోబర్ నెల నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అలాగే సుకుమార్ మూవీ తరువాత రామ్ చరణ్, త్రివిక్రమ్ డైరెక్షన్ లో పనిచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.


ఇలా రామ్ చరణ్ ఈసారి తన అప్ కమింగ్ మూవీల విషయంలో కొంచెం దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇవన్నీ క్రేజీ కాంబినేషన్ చిత్రాలు కావటమే విశేషంగా ఉందని అంటున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, సుకుమార్ తో కలిసి కథా చర్ఛల్లో పాల్గొన్నాడు. దాదాపు కథ సైతం ఫైనల్ కావటంతో ఈ కాంబినేషన్ పై ఇండస్ట్రీలోనూ హైప్ క్రియేట్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: