సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన హీరోయిన్ త్రిష. ఇప్పుడు ఈ బ్యూటీ వరుస చిత్రాలను చేయకుండా, కథా పరంగా మంచి చిత్రాలను మాత్రమే సెలక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇందులో భాగంగానే త్రిష చేసిన మూవీ నాయకి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ విషయంలో కొంత గంధరగోళం చోటు చేసుకుంది. 

త్రిష ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీకి మార్కెట్ లో అంతగా హోప్ లేకపోవటంతో...అలాగే బిజినెస్ కి సంబంధించి కొన్ని లోటుపాటులతో మూవీ రిలీజ్ కి నోచుకోవటం లేదు. గోవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హర్రర్ కామెడీ ట్రైలర్స్ హడావిడి చేసినప్పటికీ...థియోటర్స్ కి ప్రేక్షకులు వచ్చే అవకాశం అంతగా లేనట్టు అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

అయితే ఇందంతా త్రిష ఈ మూవీలో నటించటమే కారణం అని అంటున్నారు. నిజానికి ఈ మూవీ కథకి మొదట త్రిష నో అని చెప్పిందంట. తరువాత స్టార్ కాస్టింగ్ విషయంలో రిచ్ గా ఉంటుందని, త్రిషని కన్విన్స్ చేసి ఫైనల్ గా ఒప్పించారు. మార్కెట్ లో ప్రస్తుతం త్రిషకి అంతగా డిమాండ్ లేకపోవటంతో అందరూ స్టార్ కాస్టింగ్ రాంగ్ అని అంటున్నారు.

ఏదేమైనా గత రెండు నెలలుగా రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్న ఈ మూవీ, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా స్పష్టత రాకపోవటంతో...ఈ మూవీపై మార్కెట్ లోనూ అంచనాలు తారుమారు అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ ఒకేసారి తెరకెక్కి, ఒకేసారి రిలీజ్ కానుంది. స్టార్ సెలక్షన్ రాంగ్ అనే రిపోర్ట్ బయటకు రావటంతో, ఇండస్ట్రీలో ఈ మూవీ గురించి ప్రస్తుతం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: