ఈ మద్య తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సినీ నటుల  అనారోగ్యాలు అభిమానులను ఎంతో కంగారు పెట్టిస్తున్నాయి. తాజాగా రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని వార్తలు రావడంతో అభిమానులు ఒక్కసారిగా దిగాలు పడ్డారు..ఆయన ఆరోగ్యం కుదుట పడాలని పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆయకు కిడ్నీ ఆపరేషన్ జరిగిందని వార్తలు కూడా దావానంలా వ్యాపించింది. తాజాగా తమిళ హీరో శరత్‌కుమార్‌ తీవ్రమైన గుండె నొప్పితో గురువారం చెన్నైలోని ఆపోలో హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యిన సంగతి తెలిసిందే. శరత్ కుమార్ జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలి పడిపోయారట. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు అయితే శరత్ కుమార్ ని పరిక్షించిన డాక్టర్లు అది గుండె పోటు కాదని ఫుడ్ పాయిజన్ కావడం వల్లే కడుపు నొప్పి వచ్చిందని తేల్చారు.
actor Sarathkumar hospitalised
కొన్ని రిపోర్ట్ లలో మాత్రం వర్కవుట్స్ చేస్తున్నప్పుడు మైల్డ్ గా హార్ట్ ఎటాక్ వచ్చిందని అంటున్నారు. ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్లు మాట్లాడుతూ,'ప్రస్తుతం శరత్‌కుమార్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. క్రమ క్రమంగా మెరుగుపడుతోంది. త్వరలోనే ఆయన సంపూర్ణంగా కోలుకుంటారు' అని చెప్పారు. ఈ మద్య ఎలక్షన్లలో శరత్ కుమార్ విపరీతంగా ప్రచారం చేశారు.

అంతే కాదు ఆ మద్య విశాల్ తో పోటీ పడి నడిగర్ సంఘం ఎలక్షన్లో ఓడిపోయారు. నటుడిగా, ఇటు రాజకీయనాయకుడిగా శరత్‌కుమార్‌ తమిళనాట తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాధికను వివాహమాడిన శరత్‌కుమార్‌ తమిళ చిత్రాలెన్నో తెలుగు నాట కూడా ప్రదర్శితమై విశేష ఆదరణ పొందాయి. శరత్‌కుమార్‌ ఆరోగ్యం త్వరగా మెరుగు పడాలని తమిళ సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: